iDreamPost

నటుడు రందీప్ హుడా మంచి మనసు.. వరద బాధితుల కోసం..!

నటుడు రందీప్ హుడా మంచి మనసు.. వరద బాధితుల కోసం..!

హర్యానాలో గత కొంతకాలంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎన్నో ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికీ మోకాళ్ళ లోతు నీళ్లల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇంళ్లల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఈ వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అంబాలాలో కొన్ని మృతదేహాలు నీటిలో తేలుతూ వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలియచేశారు. వర్షాలు తగ్గినా అక్కడ జనజీవనం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. సరైన భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి సహాయం చేయడానికి బాలీవుడ్ నటుడు రందీప్ హుడా ముందుకు వచ్చాడు.

ఇలా వరద బాధితులకి సహాయం చేసే “ఖల్సా ఎయిడ్ ” అనే  సంస్థతో కలిసి రందీప్ ముందుకి వచ్చాడు. ఇది యూకేకి సంబంధించిన ఓ సంస్థ. గతంలో రందీప్ ఇలాగే కేరళ వరదలకు తనవంతు సహాయం చేశాడు. ఇది కాకుండా కరోనా మహమ్మారి పాకుతున్నపుడు కూడా ఎంతో మందికి ఆక్సిజన్ సీలిండర్లు అందించాడు. ఇలా ఎప్పటికప్పుడు ప్రజలకి సహాయం చేయడంలో రందీప్ ముందు ఉంటాడు. బాధితుల్లో ఒకరికి నూనె డబ్బాని అందిస్తుండగా ఓ ఫోటోని ఆ సంస్థ వాళ్ళు తమ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసుకున్నారు. అందులో రందీప్ తో పాటు అతని స్నేహితురాలు లిన్ లైశ్రం కూడా కనిపిచించారు. అభిమానులు అందరు రందీప్ పై  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సినిమాలల్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా అతను హీరో అని పొగుడుతున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా  మారాయి. రందీప్ కొద్దీ రోజుల క్రితమే తన తాజా చిత్రం గురించి ప్రకటన చేశాడు. “స్వతంత్ర వీర్ సావర్కర్” సినిమా షూటింగ్ పూర్తైంది.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుందని తెలియచేశాడు. ఇది రందీప్ దర్శకత్వం వహిస్తున్న మొదటి సినిమా కూడా. అతని ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటుడిగా తనని తాను నిరూపించుకున్న రందీప్ హుడా.. ఇప్పుడు డైరెక్టర్ గా ఏ విధంగా ఆకట్టుకోబోతున్నాడు అంటూ ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Randeep Hooda (@randeephooda)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి