iDreamPost

10 ఏళ్ల వయసులో తప్పిపోయి 20 ఏళ్లకు ఇంటికి చేరింది!

10 ఏళ్ల వయసులో తప్పిపోయి 20 ఏళ్లకు ఇంటికి చేరింది!

పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు రమ్య. ఆమె 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కనిపించకుండాపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు చాలా రోజుల పాటు వెతికారు. కానీ, ఆ యువతి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేంలేక సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఇటీవల కనిపించకుండాపోయిన రమ్య 20 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. కూతురి రాకతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషంతో మురిసిపోతున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇన్నాళ్లు ఆ యువతి ఎక్కడ ఉండిపోయిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు పెన్నాగరం పరిధిలోని కెండయనళ్లలో గ్రామంలో రమ్య అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే ఈ అమ్మాయి 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పాఠశాల తరుఫున కర్ణాటక టూర్ కు వెళ్లి తప్పిపోయింది. దీంతో కూతురు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అంతటా గాలించారు. కానీ, ఆ యువతి ఆచూకి మాత్రం దొరకలేదు.

కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత రమ్య తిరిగి ఇంటికి వచ్చింది. కూతురు తిరిగి ఇంటికి రావడంతో ఆ యువతి తల్లిదండ్రులు సంతోషంతో మురిసిపోతున్నారు. కాగా, ఆ యువతి ముంబైలోని ఉన్నట్టు తెలియడంతో మహారాష్ట్రలోని పూణెలో ఉన్న బధిరుల సంస్థ మొత్తానికి రమ్యని వారి ఇంటికి చేర్చింది. కూతురు రాకను ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పండగ చేసుకుంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 10 ఏళ్ల వయసులో కనిపించకుండపాయి 20 ఏళ్ల తర్వాత ఇంటికి తిరుగొచ్చిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి