iDreamPost

ఘోర ప్రమాదానికి గురైన బస్సు, 8 మంది మృతి! ఎక్కడో కాదు..!

ఘోర ప్రమాదానికి గురైన బస్సు, 8 మంది మృతి! ఎక్కడో కాదు..!

ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఉన్నట్టుండి ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 8 ప్రాణాలు కోల్పోగా.., 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ ప్రమాదానికి కారణం ఏంటంటే? నేపాల్ దఢింగ్ జిల్లాలోని గుజారి మున్సిపాలిటీలో బుధవారం ఉదయం ఓ బస్సు ప్రయాణికులతో బయలు దేరింది.

అయితే ఈ బస్సు ఉన్నట్టుండి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న త్రిశూల్ నదిలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని బయటకు తీశారు. కాగా, ఈ ప్రమాదంతో 8 మంది ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బైక్ ఢీ కొనడంతో అగ్నిప్రమాదం.. బస్సు దగ్ధం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి