iDreamPost

“స్టీల్ మ్యాన్​ ఆఫ్​ ఇండియా”జంషెడ్ జె ఇరానీ కన్నుమూత..

“స్టీల్ మ్యాన్​ ఆఫ్​ ఇండియా”జంషెడ్ జె ఇరానీ కన్నుమూత..

టాటా స్టీల్ మాజీ ఎండీ, ప్రముఖ వ్యాపారవేత్త జంషెడ్ జె ఇరానీ(86) సోమవారం అర్ధరాత్రి జంషెద్​పుర్​లో మరణించినట్లు టాటాస్టీల్ తెలిపింది. ఇరానీకి టాటా స్టీల్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. ఆయన 2011 జూన్​లో టాటా స్టీల్ బోర్డు నుంచి తప్పుకున్నారు.

“స్టీల్ మ్యాన్​ ఆఫ్​ ఇండియాగా పేరుగాంచిన పద్మభూషణ్ డాక్టర్​ జంషెడ్ జె ఇరానీ మరణం పట్ల చాలా బాధపడుతున్నాము. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం” అని టాటా స్టీల్​ ట్వీట్ చేసింది.1936 జూన్ 2న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జంషెడ్​ ఇరానీ జన్మించారు. 1963లో బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్​ రీసెర్చ్ అసోషియేషన్​లో సీనియర్ సైంటిఫిక్ అధికారిగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

1968లో భారత్​కు తిరిగి వచ్చిన జంషెడ్​.. టాటా స్టీల్​లో చేరారు. అక్కడ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ అధికారికి అసిస్టెంట్​గా పరిచేశారు. 1979లో జనరల్ మేనేజర్​.. 1985లో అధ్యక్షుడి​గా పదోన్నతులు పొందారు. 1992లో టాటా స్టీల్​కు ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలో జులై 2001 వరకు కొనసాగారు. జంషెడ్​ జె ఇరానీ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. పద్మభూషణ్​తో ఆయనను సత్కరించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి