iDreamPost

నమ్మక ద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ  ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకు  కారణం అధికార, ప్రతిపక్షల  మధ్య మాటల యుద్ధం  మాములుగా ఉండదు. ప్రస్తుతం ఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మధ్య వార్ నడుస్తోంది.  గత రెండు రోజుల నుంచి వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా పురంధేశ్వరికి విజయ సాయిరెడ్డి కౌంటరిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ  ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకు  కారణం అధికార, ప్రతిపక్షల  మధ్య మాటల యుద్ధం  మాములుగా ఉండదు. ప్రస్తుతం ఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మధ్య వార్ నడుస్తోంది.  గత రెండు రోజుల నుంచి వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా పురంధేశ్వరికి విజయ సాయిరెడ్డి కౌంటరిచ్చారు.

నమ్మక ద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ  ఓ రేంజ్ లో ఉంటుంది. అందుకు  కారణం అధికార, ప్రతిపక్షల  మధ్య మాటల యుద్ధం  మాములుగా ఉండదు. ఎన్నికలు లేకున్నా.. ఆ స్థాయిలో రాజకీయాలు ఏపీలో సాగుతుంటాయి. నిత్యం ఏదో ఒక విషయంపై ఏపీ రాజకీయం హీటెక్కుంది. అలానే తరచూ ఏదో ఒక ఇద్దరు నేతల మధ్య సవాళ్ల పర్వం కనిపిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మధ్య వార్ నడుస్తోంది.  గత రెండు రోజుల నుంచి వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా పురంధేశ్వరికి విజయ సాయిరెడ్డి కౌంటరిచ్చారు. పురంధేశ్వరి ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్లడంతో ఏం చేయాల్లో దిక్కుతొచని స్థితిలో పడ్డారంటూ ఎద్దేవా చేశారు.

వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా పురంధేశ్వరిపై  ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రల్లో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర రావులే అని ఆయన అన్నారు.  అంతేకాక పురందేశ్వరి పాదరస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయిందన్నారు.  రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని ఆయన ఫైర్ అయ్యారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా  ఛత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల ఇన్ ఛార్జీగా  అట్టర్ ఫ్లాప్  కావడంతో అక్కడా మిమ్మల్ని తీశారని, దీంతో  టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తే.. మీ ఎఫెక్ట్ తో ఆయన కూడా జైలుకు వెళ్లాడంతో  దిక్కుతోచని స్థితిలో  పడ్డారని సాయి రెడ్డి పేర్కొన్నారు.

రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్టేషన్ కి కాలమే సమాధానం చెబుతుందని తెలిపారు. దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది. పురంధేశ్వరని, సోదరులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘన చరిత్ర ఆమెదేనని తెలిపారు. అన్న హరికృష్ణ చేత పార్టీ పెట్టించి… కొబ్బరికాయ కొట్టి.. ఆ పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్  చేరి సోనియా గాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు పురంధేశ్వరి అంటూ ఫైర్ అయ్యారు. నమ్మక ద్రోం అనేది ఆమె వ్యక్తిత్వంలోనే ఉందని, తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా అంటూ, విలువల్లేని రాజకీయాలకు పురంధేశ్వరి చిరునామాగా మారిందిని, ఇలాంటి వారిని మోసగాళ్లకు మోసగాళ్లు అంటారని ఘాటు విమర్శలు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి