iDreamPost

ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు!

  • Author singhj Updated - 04:37 PM, Sat - 21 October 23

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఇలాంటి గౌరవం మాహీకి దక్కుతుందని ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు. ధోనీకి దక్కిన ఆ గౌరవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. ఇలాంటి గౌరవం మాహీకి దక్కుతుందని ఎవ్వరూ ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు. ధోనీకి దక్కిన ఆ గౌరవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Updated - 04:37 PM, Sat - 21 October 23
ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ఇది అస్సలు ఎక్స్​పెక్ట్ చేసి ఉండరు!

మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు ప్రస్తావన రానిదే ఇండియన్ క్రికెట్ హిస్టరీ గురించి చెప్పలేం. అంతగా భారత క్రికెట్ ​పై తన ప్రభావం చూపించాడు ధోని. ఒక ప్లేయర్​ గా, కెప్టెన్ ​గా అతడు సాధించిన ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ కొత్తలో ధనాధన్ ఇన్నింగ్స్ ​లతో ఒక్కసారిగా క్రికెట్ వరల్డ్ దృష్టిని ఆకర్షించాడు మహీ. ఎంతటి భీకర బౌలింగ్ అటాక్ మీదైనా ఫోర్లు, సిక్సులు కొడుతూ మ్యాచ్​ ను ఫినిష్ చేయడంలో ఎక్స్​పర్ట్ ​గా మారాడు. యువరాజ్ సింగ్​ తో కలిసి ఛేజింగ్ ​లో ఎన్నో మ్యాచుల్లో టీమిండియాను గెలిపించాడు ధోని. అతని టాలెంట్, ఒత్తిడి లేకుండా ఆడటం, కూల్ ​గా ఉండే తత్వాన్ని చూసి 2007 టీ20 వరల్డ్ కప్​ లో జట్టు కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించారు.

ఆ వరల్డ్ కప్ ​లో బ్యాటర్ ​గా, కెప్టెన్ ​గా ఫుల్ సక్సెస్ అయిన ధోని.. భారత్​ ను ఛాంపియన్ ​గా నిలిపాడు. దీంతో భారత క్రికెట్ సేఫ్​ హ్యాండ్స్ ​లో ఉందని అందరికీ అర్థమైపోయింది. ధోనీనే ఫ్యూచర్ స్టార్ అని.. టీమిండియాకు మరిన్ని విజయాలు అందిస్తాడని అందరూ డిసైడయ్యారు. వారి నమ్మకాన్ని మహీ వమ్ము చేయలేదు. దాదాపుగా మూడు దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్​ ను 2011లో  భారత్ ​కు అందించాడు ధోని. స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో టీమిండియాను ఛాంపియన్ ​గా నిలిపి క్రికెట్ దేవుడు సచిన్​ తీరని డ్రీమ్​ ను నెరవేర్చాడు ధోని. అయితే ఇందులో యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ లాంటి మిగతా ప్లేయర్ల కాంట్రిబ్యూషన్​ ను తక్కువ చేయడానికి లేదు.

వరల్డ్ కప్-2011 విజయంలో యువరాజ్, గంభీర్ లాంటి ప్లేయర్ల పాత్ర ఎంతగానో ఉంది. అయితే సారథిగా టీమ్​ ను ముందుండి నడపడం, కెప్టెన్సీ నాక్ ​తో అందరిలోనూ స్ఫూర్తిని నింపిన ధోనీకి ఎక్కువ క్రెడిట్ దక్కింది. ఆ ప్రపంచ కప్​ లో కులశేఖర బౌలింగ్​ లో మహీ కొట్టిన హెలికాప్టర్ షాట్ కి బాల్ వెళ్లి సిక్స్ బౌండరీలో పడింది. ఈ విన్నింగ్ షాట్​ ఇప్పటికీ అభిమానుల మనసుల్లో మెదులుతూ ఉంటుంది. ఈ షాట్​ ను ధోని కొట్టడం, భారత్ కప్పు గెలవడంతో ముంబై, వాంఖడే స్టేడియంలోని వేలాది మంది ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఆ మ్యాచ్​ లో ధోని కొట్టిన సిక్స్ స్టేడియంలో దూరంగా ఉన్న సీట్లలో పడింది.

ప్రస్తుతం వరల్డ్ కప్-2023 మ్యాచుల నేపథ్యంలో అక్టోబర్ 21న ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మ్యాచ్ ​కు ఆతిథ్యం ఇచ్చేందుకు వాంఖడే స్టేడియం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ధోని కొట్టిన సిక్స్ ల్యాండ్ అయిన సీట్ల దగ్గర వరల్డ్ కప్-2011 విన్నింగ్ టీమ్ ఫొటోను పెట్టి స్పెషల్​ గా డిజైన్ చేశారు. ఆ సీట్లకు కింద నార్మల్ సీట్లను కేటాయించారు. క్రికెట్ ​లో ఇలా ఒక బాల్ పడిందని సీట్లను ప్రత్యేకంగా గౌరవిస్తూ, స్పెషల్ జోన్​ గా రిజర్వ్​డ్​గా ఉంచడం బహుశా ఇదే ఫస్ట్ టైమ్ కావొచ్చు. ఈ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ ఇది ధోనీకి దక్కిన అరుదైన గౌరవం అని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని అస్సలు ఎక్స్​పెక్ట్ చేయలేదని చెబుతున్నారు. మరి.. ధోని కొట్టిన షాట్​ కు వాంఖడే స్టేడియం ఈ విధంగా గౌరవించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మనం ఏది చేస్తే.. మనకు అదే జరుగుతుంది! కోహ్లీ విషయంలో అదే నిజమైంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి