iDreamPost

అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఆగంతకులు.. బాత్రూమ్‌లోకి చొరబడి..

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్‌లోకి ఆగంతకుల చొరబాటు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అర్థరాత్రి వేళ బాత్రూం కిటికీ పగలకొట్టి లేడీస్ హాస్టల్ లోకి ఇద్దరు అగంతకులు ప్రవేశించారు.

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్‌లోకి ఆగంతకుల చొరబాటు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అర్థరాత్రి వేళ బాత్రూం కిటికీ పగలకొట్టి లేడీస్ హాస్టల్ లోకి ఇద్దరు అగంతకులు ప్రవేశించారు.

అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఆగంతకులు.. బాత్రూమ్‌లోకి చొరబడి..

తెలంగాణకు తలమానికమైన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులకు రక్షణ కరువైంది. తాజాగా చోటుచేసుకున్న ఘటనతో ఉస్మానియా విద్యార్థినులు ఉలిక్కిపడ్డారు. సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్‌లోకి ఆగంతకుల చొరబాటు తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అర్థరాత్రి వేళ బాత్రూం కిటికీ పగలకొట్టి లేడీస్ హాస్టల్ లోకి ఇద్దరు అగంతకులు ప్రవేశించారు. ఆ పై విద్యార్థినులపై దాడికి ప్రయత్నించారు. దీంతో వెంటనే విద్యార్థినులు అప్రమత్తమై ఒకరిని పట్టుకొని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు.

మరో ఆగంతకుడు పారిపోయాడు. అనంతరం హాస్టల్ దగ్గర విద్యార్థినులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ హాస్టల్లో తమకు రక్షణ కరువైందని వెంటనే వీసీ వచ్చి తమ సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. అర్ధరాత్ర వేళ హాస్టల్ బాత్రూంలోకి ఇద్దరు దుండగులు చొరబడడంపై అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు విద్యార్థినులు. సెక్యూరిటీ విషయంలో వీసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలు ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి