iDreamPost

గంట వ్యవధిలో తల్లీ, కూతురు మృతి.. కన్నీరు తెప్పిస్తున్న వీరి మరణం!

గంట వ్యవధిలో తల్లీ, కూతురు మృతి.. కన్నీరు తెప్పిస్తున్న వీరి మరణం!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో చావు ఎప్పుడు, ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవరికీ తెలియదు. ఉదయం నిద్రలేచిన మనిషి సాయంత్రం తిరిగి ఇంటికి వస్తాడన్న గ్యారెంటీ లేదు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఇలా ఒకటేంటి ఎన్నో రకాలుగా మనిషికి చావు ఎదురవ్వచ్చు. ఇదిలా ఉంటే.. ఓ తల్లీ, కూతురు గంటల వ్యవధిలోనే మరణించిన ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ విసషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు వీళ్లు ఎలా చనిపోయారో తెలిస్తే కన్నీళ్లు రాక మానవు. అసలేం జరిగిందంటే?

బంధువుల కథనం ప్రకారం.. ముషీరాబాద్ దోమలగూడలోని రోజ్ కాలనీలో ఈ నెల 11 గ్యాస్ సిలీండర్ లీకైన విషయం తెలిసిందే. దీంతో ఆ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న పద్మ (53), ఆమె కూతురు ధనలక్ష్మి (28), ఈమె కొడుకు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఈ ముగ్గురు శుక్రవారం ప్రాణాలు విడిచారు. ఈ విషయం తెలుసుకున్న వీరి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగితేలారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదంలో ఘటన జరిగిన రోజే శరణ్య అనే బాలిక కూడా మరణించింది. ఇక మిగలిన వారి పరిస్థితి కూడా కాస్త విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక వీరి మరణవార్త పలువురికి కన్నీరు తెప్పిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి