iDreamPost

నటుడు రచయిత ఉత్తేజ్ కుటుంబంలో విషాదం

నటుడు రచయిత ఉత్తేజ్ కుటుంబంలో విషాదం

ప్రముఖ నటుడు రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. ఇవాళ హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రిలో కన్ను మూశారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆవిడను కాపాడలేకపోయారు. పద్మావతి వయసు కేవలం 48 సంవత్సరాలు. ఉత్తేజ్ బయట నిర్వహించే సామజిక కార్యక్రమాల్లోక్రీయాశీలక పాత్ర పోషించేవారు.

ఉత్తేజ్ స్థాపించిన మయూఖ టాకీస్ ఫిలిం యాక్టింగ్ నిర్వహణ బాధ్యత కూడా పద్మావతే చూసుకునేవారు. వార్త తెలిసిన వెంటనే చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ తదితరులు ఉత్తేజ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. వీళ్ళ కూతురు తనయను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. చిరంజీవి ఒళ్ళో తల పెట్టుకుని ఉత్తేజ్ చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవటం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇవాళ మధ్యాన్నమే మహాప్రస్థానంలో పద్మావతి అంత్యక్రియలు జరపబోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి