iDreamPost

Video: ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీకొట్టిన కారు! ఐదుగురు మృతి!

మృత్యువు అనేది చుట్టు వైఫై లా మన చుట్టునే తిరుగుతుంది. కాకపోతే..తన టైమ్ వచ్చినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతుంది. అయితే ఇది ఏ రూపంలో మనకు కనెక్ట్ అయి.. మన బంధాలను డిస్ కనెక్ట్ చేస్తుందో ఎవ్వరం చెప్పలేము. తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటన చూస్తే..అలానే అనిపిస్తుంది.

మృత్యువు అనేది చుట్టు వైఫై లా మన చుట్టునే తిరుగుతుంది. కాకపోతే..తన టైమ్ వచ్చినప్పుడు మాత్రమే కనెక్ట్ అవుతుంది. అయితే ఇది ఏ రూపంలో మనకు కనెక్ట్ అయి.. మన బంధాలను డిస్ కనెక్ట్ చేస్తుందో ఎవ్వరం చెప్పలేము. తాజాగా జరిగిన ఓ రోడ్డు ప్రమాద ఘటన చూస్తే..అలానే అనిపిస్తుంది.

Video: ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను ఢీకొట్టిన కారు! ఐదుగురు మృతి!

మృత్యువు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం చెప్పలేము. చాలా మంది తన దారిలో తాను వెళ్తున్నాను అనే భావనలో ఉంటారు. కానీ మృత్యువు మన వెనకాలే వస్తుందనే గ్రహించలేదు. కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఇలా కూడా మరణం వెంటాడుతుందా అనే భావన కలగక మానదు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదాన్ని చూస్తే.. అచ్చం అదే అభిప్రాయం కలుగుతుంది. రోడ్డుకు మార్జిన్ లో తనదారిలో తాను బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి.  అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి  కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా కొందరు చేసే ప్రమాదాల కారణం అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. అతివేగంగా వస్తున్న ఓ కారు…రోడ్డుకు చివర్లో వెళ్తున్న ఓ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురితో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తమిళానాడు రాష్ట్రంలోని తిరుచ్చి – మధురై రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.  ఈప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. గాయలైన ఓ వ్యక్తి మార్గం మధ్యలో మరణించినట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రమాద స్థలి నుంచి మృతదేహాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇక సీసీటీవీ దృశ్యాలను చూసినట్లు అయితే ఈ ఘోర ప్రమాద దృశ్యం  ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రోడ్డుకు ఒక మార్జిన్ లో బైక్ ను ఢీకొట్టిన కారు.. డివైడర్ ను దాటుకుంటూ వ్యతిరేక దిశలో ఉన్న అవతలి రోడ్డుపైకి వెళ్లింది. అక్కడ మరో వాహనాన్ని ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో ఆ రోడ్డు రక్తసిక్తంగా మారింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోనూ మీరు వీక్షించి.. ఇలాంటి ఘటనల నివారణకు ఏం చర్యలు తీసుకోవాలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి