iDreamPost

పాకిస్థాన్ లో కసాయి అన్నయ్య.. సొంత చెల్లెల్ని ఇలా చేయడం ఏంటి?

Pakistan Crime News: ఈ మధ్య కాలంలో యువత చాలా వరకు ప్రేమ పెళ్లిళ్లకే జై కొడుతున్నారు. ఇందుకు పెద్దలను ఎదిరించి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు.

Pakistan Crime News: ఈ మధ్య కాలంలో యువత చాలా వరకు ప్రేమ పెళ్లిళ్లకే జై కొడుతున్నారు. ఇందుకు పెద్దలను ఎదిరించి తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు.

పాకిస్థాన్ లో కసాయి అన్నయ్య.. సొంత చెల్లెల్ని ఇలా చేయడం ఏంటి?

‘మామైపోతున్నడమ్మా మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అని ప్రముఖ కవి అందెశ్రీ అన్నట్లు ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి. దానికి తగినట్లు  కొన్ని దారుణమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి.  ఆస్తుల కోసం సొంత వారినే దారుణంగా చంపుతున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు.  మరికొన్ని తమ కులం, మతం కాని వారిని ప్రేమించారన్న కోపంతో సొంత బిడ్డను చంపుకుంటూ.. పరువు హత్యలకు పాల్పపడుతున్నారు. పాకిస్థాన్ లో ఓ అన్న చేసిన ఘాతుకం.. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్ దేశం పంజాబ్ ప్రావిన్స్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తోబా సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కొంత కాలంగా ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి మారియా (22) అనే చెల్లెలు ఉంది. మార్చి 17వ తేది రాత్రి తోబా సింగ్ దారుణానికి తెగబడ్డాడు. తన సోదరి నిద్రిస్తున్న సమయంలో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణానికి పాల్పపడుతున్న సమయంలో ఆ ఇంటి పెద్ద పక్కనే ఉన్నాడు. రాక్షసుడిగా మారిన తోబా సింగ్ చెల్లెల్ని హత్య చేస్తుండగా ఏమాత్రం వారించలేదు. పైగా హత్య చేసిన తర్వాత ఓ నీళ్ల బాటిల్ అందించాడు. హత్య జరిగే సమయంలో మరో మహిళ కూడా అక్కడే ఉంది.

ఈ హింసాత్మకమైన ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావంతో పాకిస్థాన్ పోలీస్ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇంత దారుణమైన సంఘటన ప్రపంచాన్ని వణికించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దారుణం ఏంటంటే మరియాను చంపుతున్న వీడియో తీసింది ఎవరో తెలుసా? తోబా సింగ్ కూతురు. తన అత్తను చంపుతుంటే వీడియో తీసింది. అయితే మరియాను చంపడం వెనుక ఆమె ప్రేమ వ్యవహారం, పరువు హత్య అని పోలీసులు చెబుతున్నారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టిన మరియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి