iDreamPost

50 మందిని పెళ్లి చేసుకున్నాడు.. చివరికి?

50 మందిని పెళ్లి చేసుకున్నాడు.. చివరికి?

ప్రస్తుతం సమాజంలో పెళ్లి కాని యువకుల సంఖ్య బాగా పెరిగిపోతుంది. పెళ్లి చేసుకునేందుకు యువకులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు అయితే చెప్పులు అరిగేలా అమ్మాయిల కోసం వెతుకుతున్నారు. ఇలా చాలా మంది ఒక్క పెళ్లి చేసుకోవాడానికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటిది ఓ కేటుగాడు ఏకంగా 50 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాడి టాలెంట్ తెలిసిన చాలా మంది ఏంది రా సామి నువ్వు  అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతడు చేసిన మోసానికి చివరకు జైలు పాలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ కు చెందిన తబేష్ కుమార్ అనే  వ్యక్తి ఎంతో మందిని వివాహం చేసుకుని మోసం చేశాడు.  1992 నుంచి అతడు చేసిన మోసాలు ఇటీవలే బయట పడ్డాయి.  తొలుత కోల్ కత్తాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం పాటు ఆమెతో కాపురం చేయడం.. వారికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెళ్లైన 8 ఏళ్ల తరువాత భార్య, పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. కొంతకాలం తరువాత బెంగళూరులో ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. చాలా మంది  యువతను మోసం చేశాడు. ఆ తరువాత తన మోసాలకు అడ్డుగా మాట్రిమోనీని ప్రారంభించాడు.

దీని ద్వారా ఎంతో మంది యువతులను , మహిళలను మోసం చేశాడు.  ముఖ్యంగా విడాకులు  తీసుకున్న మహిళలు, వింతంతువులనే లక్ష్యం  చేసుకుని ఇతడు మోసాలకు పాల్పడ్డాడు. తన మాయ మాటలతో దాదాపు 50 మంది మహిళలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు.  వారితో కొంతకాలం పాటు శారీరకంగా గడిపి.. ఆ  తరువాత వారి నుంచి బంగారం, నగదు తీసుకుని పారిపోయేవాడు. చివరకు ఓ మహిళ పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో ఇతడి బండారం బయట పడింది. ఈ కేటుగాడి బాధితుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, త్రిపుర, యూపీ, ఒడిశా, తెలంగాణ, కర్ణాటకు చెందిన వారు. ఇంకా దారుణం ఏమిటంటే.. అతడి చేతిలో మోసపోయిన వారిలో డాక్టర్లు, ఇంజినీర్లు, సాఫ్ట్ వేరు ఉద్యోగినిలు, టీచర్లు, పలువురు వ్యాపార వేత్తలు ఉన్నారు. మోసగాడి మాటలు తీయగా ఉంటాయని ఈ వార్త తెలిసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ కేటుగాడికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి