Dharani
ప్రస్తుత కాలంలో అత్యధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య థైరాయిడ్. దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉంది అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో అత్యధిక మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్య థైరాయిడ్. దీనికి ఆయుర్వేదంలో మంచి ఔషధం ఉంది అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుత కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న అనారోగ్య సమస్య.. థైరాయిడ్. నేడు మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నట్లు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఈ సమస్య మగవారి కన్నా ఆడవారిలోనే అధికం. అసలు ఏంటి ఈ థైరాయిడ్ అంటే.. మనిషి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది.
ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే దాన్ని హైపో థైరాయిడ్ అని, అధికంగా ఉంటే హైపర్ థైరాయిడ్ అని అంటారు. ఈ సమస్య బారిన పడితే అధికంగా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. దీనికి మందులు ఉన్నప్పటికి.. ఆయుర్వేదంలో మంచి ఔషధం ఒకటి ఉంది. దాంతో ఈ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకు ఏంటా ఔషధం అంటే..
థైరాయిడ్ బారినపడ్డ వారికి దివ్యౌషధం సరస్వతి ఆకులు. వీటి ద్వారా తయారు చేసిన మందుతో థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని.. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకు సరస్వతి ఆకుతో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే..
సరస్వతి ఆకులో ఎసిటిక్ యాసిడ్, ఎసిటమైడ్, బ్రాహ్మణిసైడ్ వంటి రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో టీ4 హార్మోన్ స్థాయిని పెంచుతుంది. కనుక సరస్వతి ఆకు థైరాయిడ్ సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.