iDreamPost

లక్ష్మణుడి పాత్రలో నటించనున్న నవీన్ పోలిశెట్టి?

  • Published Feb 21, 2024 | 2:57 PMUpdated Feb 21, 2024 | 2:57 PM

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కాంబీనేషన్ లో తెరకెకక్కనున్న చిత్రం రామాయణం. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో యాంగ్ హీరో ప్రత్యేక పాత్రలో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకి ఎవరంటే..

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, కాంబీనేషన్ లో తెరకెకక్కనున్న చిత్రం రామాయణం. ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ అనేది శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో యాంగ్ హీరో ప్రత్యేక పాత్రలో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంతకి ఎవరంటే..

  • Published Feb 21, 2024 | 2:57 PMUpdated Feb 21, 2024 | 2:57 PM
లక్ష్మణుడి పాత్రలో నటించనున్న నవీన్ పోలిశెట్టి?

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘రామాయణం’ సినిమా వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. దంగల్ ఫేమ్ దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా ఈ భారీ సినిమాలో ఎంతో ముఖ్యమైన పాత్ర అయిన లక్షణుడి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం పై ఆసక్తికరమైన రూమర్ ఒకటి బయటకి నచ్చింది. ‘రామాయణం’లో లక్షణుడి పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లక్ష్మణుడి పాత్రలో నటించేందుకు గానూ నవీన్ పొలిశెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం నలుగురైదుగురు నటులను షార్ట్ లిస్ట్ చేయగా అందులో నవీన్ పొలిశెట్టిని చిత్ర బృందం ఎంచుకుందట. నవీన్ పొలిశెట్టి ఇప్పటికే నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘చిచ్చోరే’ సినిమాలో నటించారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, శ్రద్ధా కపూర్ ఆ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. 2019 లో విడుదలయిన ‘ చిచ్చోరే’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ స్నేహం వల్ల నితేష్ తివారీ, తను తెరకెక్కించబోతున్న రామాయణం సినిమాలో నటించమని నవీన్ పోలిశెట్టిని అడిగి ఉండవచ్చు. నిజానికి అధికారికంగా ఈ సినిమాలోని నటీనటుల గురించి ఎలాంటి ప్రకటనా రానప్పటికీ… చాలా కాలంగా రామాయణం సినిమా గురించి ఒకదాని తర్వాత మరొకటి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. త్వరలోనే నవీన్ పోలిశెట్టి పాత్రకి సంభందించిన ప్రకటన వస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తారని కూడా గట్టి ప్రచారం జరుగుతోంది. ఇక సీత పాత్ర కోసం మొదట రణ్‌బీర్ కపూర్ భార్య అలియా భట్ ను సంప్రదించగా, ఆ తర్వాత అవిడ స్థానంలో సాయి పల్లవి వచ్చారు. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ కోసం చిత్ర యూనిట్ వివిధ రకాల జాగర్తలు తీసుకుంటున్నారట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి