iDreamPost

మంచివారే తొందరగా ఎందుకు చనిపోతారు? పురాణ గ్రంధాల్లో చెప్పిన నిజాలు!

  • Published Apr 11, 2024 | 4:28 PMUpdated Apr 11, 2024 | 4:28 PM

సాధరణంగా దేవుడు ఈలోకంలో చెడు చేసే వ్యక్తులకు ప్రాణాలతో ఉంచి.. మంచివారినే ఎందుకో త్వరగా తీసుకుపోతాడు. అసలు మంచి వాళ్లకి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదా దేవుడు ఎందుకింత కఠినాత్ముడు అని చాలామంది తిట్టుకుంటారు. అయితే నిజంగా దేవడు మంచి వారినే ఎందుకు తీసుకుపోతాడు..? దీని వెనుక గల కారణమేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధరణంగా దేవుడు ఈలోకంలో చెడు చేసే వ్యక్తులకు ప్రాణాలతో ఉంచి.. మంచివారినే ఎందుకో త్వరగా తీసుకుపోతాడు. అసలు మంచి వాళ్లకి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదా దేవుడు ఎందుకింత కఠినాత్ముడు అని చాలామంది తిట్టుకుంటారు. అయితే నిజంగా దేవడు మంచి వారినే ఎందుకు తీసుకుపోతాడు..? దీని వెనుక గల కారణమేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 11, 2024 | 4:28 PMUpdated Apr 11, 2024 | 4:28 PM
మంచివారే తొందరగా ఎందుకు చనిపోతారు? పురాణ గ్రంధాల్లో చెప్పిన నిజాలు!

ఈరోజుల్లో మంచి అనేది ఈ లోకానికి అంతగా రుచించిన పదం. అందుకే మంచిపని అయిన, మంచివారైనా..ఈ లోకానికే కాదు, ఆ దేవుడికి కూడా ఎందుకో అంతగా గిట్టాదు. అందుచేతనే ఏదో కారణంతో.. నిండు నూరెళ్లు జీవించాల్సిన మంచి మనుషులను అర్థాంతరంగా సగం ఆయుష్షుతో మరణిస్తుంటారు. అయితే ఇలా మరణించిన వారిలో.. సమాజానికి మేలు చేసినవారు, ఎదుటవారికి ఉపాకారం చేసినవారు, ఎవరికి ఏ హనీ తలపెట్టానివారే ఎక్కువగా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి పసి పిల్లలని జాలీ కూడా లేకుండా.. ఆ దేవడు వారి ప్రాణాలను సైతం త్వరగా తీసుకెళ్లి పోతుంటాడు. అలాంటి సమయంలో ఈ దేవుడు ఎంత కఠినాత్ముడు అంటూ చాలామంది తిట్టుకుంటారు. అలాగే ఈ భూమి మీద చెడు చేసే వ్యక్తులకు ప్రాణాలతో ఉంచి.. మంచివారినే ఎందుకు త్వరగా తీసుకుపోతాడు. అసలు మంచి వాళ్లకి ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదా అంటూ.. ఎంతోమంది మదిలో ప్రశ్నలు రేకెత్తిస్తుంటాయి. అయితే నిజంగా దేవడు మంచి వారినే ఎందుకు తీసుకుపోతాడు..? దీని వెనుక గల కారణమేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వ కాలంలో.. మన తాత ముత్తాతలు దాదాపు 100 సంవత్సరాల వరకు జీవించేవారు. అయితే ఆనాటి కాలంలో కూడా మంచి, చెడ్డ స్వభావం కలిగిన మనుషులు ఉండేవారు. అలాగే వారందరూ.. 100 ఏళ్లకు పైగా జీవించేవారు. కానీ, ప్రస్తుత కాలంలో మనుషులు 60, 70 సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారు. అందులో మంచివారిని అయితే ఆ దేవుడు మరి త్వరగా ఆయన దగ్గరకు తీసుకెళ్లిపోతుంటాడని పెద్దలు చెబుతుంటారు. అసలు నిజంగా చెడు చేసే వారి కంటే మంచివారు ఎందుకు త్వరగా చనిపోతారు..? ఇలా నిజంగా జరుగుతుందా అని ఎప్పుడైనా ఆలోచించారా..? అయితే ఈ విషయం గురించి భగవద్గీత గ్రంథాలలో వివరించడం జరిగింది. అందులో .. ”జాతస్య హి ధ్రువః మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి అని ఆ దేవుడు భగవద్గీతాలో చెప్పాడు. అయితే భగవద్గీత చదివిన చాలామందికి ఇందులో సారంశం తెలిసే ఉంటుంది. ”పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు”. అసలు మన సనాతన ధర్మంలో ఒక వ్యక్తి జన్మించక ముందే అతను ఎక్కడ ఎప్పుడు ఎలా పుడతాడు..? అతని తల్లిదండ్రులు ఎవరు..? ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? ఎలాంటి పిల్లలకు జన్మనిస్తాడు..? ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు చనిపోతాడో కూడా ముందే రాసిపెట్టి ఉంటుందని నమ్ముతారు. ఇలా అన్ని మతాలలో కూడా మరణం ఒక తిరుగులేని సత్యమని నమ్ముతారు. ఎందుకంటే.. ఒక మనిషి జన్మించిన తర్వాత.. ఏదో ఒక రోజు మరణించక తప్పదు ఇది వాస్తవమైన సత్యం.

అయితే శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు అంటుంటారు. మరి, అలాంటప్పుడు మంచివారే ఎందుకు ముందు చనిపోతారు అనే ప్రశ్నకు పురాణ గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే..? ఇక్కడ దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదని అర్థం. అయితే ఇక్కడ దేవుడు ప్రతి మంచి వ్యక్తిని ఏదో ఒక కారణం కోసమే ఈ ప్రపంచంలోకి పంపిస్తాడని మన హిందూమతంలోని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఏ కారణంతో అయితే ఆ మంచి వ్యక్తి ఈ భూమ్మీదకి వస్తాడో ఆ కారణం పూర్తవగానే దేవుడు వారిని తిరిగి వెనక్కి రప్పించేసుకుంటాడని , చాలామంది విశ్వసిస్తుంటారు. అంటే.. మంచి వ్యక్తుల మరణం అనేది వారు చేసే మంచి పనుల పైన ఆధారపడి ఉంటుందని హిందువులు బలంగా నమ్ముతారు. అందుకే ఈ కలియుగంలో.. పాపాలు చేసే పాపులు ఎక్కువ కాలం జీవిస్తారని పుణ్యాలు చేసే పుణ్యాత్ములు ఈ లోకాన్ని త్వరగా విడిచిపెట్టి వెళ్లిపోతారని తెలుస్తోంది. మరి, మంచి వాళ్లు ఈ లోకం నుంచి ఎందుకు త్వరగా వెళ్లిపోతారో పురణాల్లో తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి