iDreamPost

Aadavaallu Meeku Johaarlu : ఆడవాళ్ళ రాక వెనుక అసలు కారణం

Aadavaallu Meeku Johaarlu : ఆడవాళ్ళ రాక వెనుక అసలు కారణం

నిన్న హఠాత్తుగా శర్వానంద్ కొత్త సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు విడుదలని ఫిబ్రవరి 25కి ప్రకటించడం ఆయన అభిమానులకేమో కానీ పవన్ ఫ్యాన్స్ కి మాత్రం చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆ డేట్ కి ఆల్రెడీ భీమ్లా నాయక్ ఉంది. మరి నేరుగా పవర్ స్టార్ తో బాక్సాఫీస్ వద్ద తలపడటమంటే అంత సేఫ్ గేమ్ కాదు. పైగా అది కూడా డ్రైగా ఉండే ఫిబ్రవరి లాంటి నెలలో. మరి ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారనే అనుమానం కలగడం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం భీమ్లా రావడం లేదని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆడవాళ్ళు టీమ్ 25ని లాక్ చేసుకుందని తెలిసింది. ఇంకొకరు తీసుకోక ముందే తెలివిగా అనౌన్స్ మెంట్ ఇచ్చేశారన్న మాట.

నిజానికి దీనికన్నా ముందు శర్వానంద్ మరో సినిమా ఒకే ఒక జీవితం రెడీగా ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్, ఒక లిరికల్ వీడియో కూడా వచ్చేశాయి. ఆడవాళ్ళు మీకు జోహార్లు ఇంకా ప్రమోషన్ మొదలుపెట్టలేదు. మరి అలాంటప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా రెండో చిత్రం మీదున్న కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన ఆడాళ్ళు మీకు జోహార్లులో ఆకర్షణలు గట్టిగానే ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ కావడం మొదటిది కాగా రాధికా నదియా లాంటి సీనియర్ లేడీ ఆర్టిస్టులు తెరనిండా కనిపిస్తారు. తిరుమల కిషోర్ దర్శకుడు.

ఈ పరిణామాలు చూస్తుంటే భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ తప్పదని స్పష్టంగా అర్థమవుతోంది కదా. 25నే బాలీవుడ్ మూవీ గంగూ బాయ్ కటియావాడి కూడా వస్తోంది. మరి పవన్ సినిమా ఎప్పుడనే ప్రశ్నకు సమాధానం వచ్చే నెల అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. బహుశా మార్చి లేదా అనుకూలం కాదనుకుంటే ఏప్రిల్ తప్ప వేరే మార్గం ఉండదు. మొత్తానికి ఆడవాళ్ళు మీకు జోహార్లు మంచి డేట్ నే పట్టేసింది. అప్పటికంతా కరోనా ఇంత తీవ్ర స్థాయిలో ఉండకపోవచ్చు. ఇప్పటికీ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు తగ్గించేశారు. యాభై శాతం అక్యుపెన్సీ ఉన్నా కూడా శర్వానంద్ కు పాజిటివ్ టాక్ వస్తే వర్కౌట్ అయిపోతుంది

Also Read : Bheemla Nayak : మళ్ళీ వాయిదా దిశగా పవన్ సినిమా ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి