సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. వారికి తక్షణమే రూ. 10 వేల సాయం

Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్తను అందించారు. వారికి తక్షణమే రూ. 10 వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో వరదలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి శుభవార్తను అందించారు. వారికి తక్షణమే రూ. 10 వేల సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

ఖమ్మంలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భారీగా కురుస్తున్న వర్షాలకు మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నిలువ నీడ లేక వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొట్టడంతో భారీగా వరదలు సంభవించాయి. ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఖమ్మంలో వరదలు రావడం బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు సాయం ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. వరదల వల్ల జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని తెలిపారు. వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

Show comments