టీమిండియా ఆటగాళ్లందరిలో ఆ విషయంలో కోహ్లీనే ముందుంటాడు: జడేజా

  • Author Soma Sekhar Published - 01:14 PM, Sat - 1 July 23
  • Author Soma Sekhar Published - 01:14 PM, Sat - 1 July 23
టీమిండియా ఆటగాళ్లందరిలో ఆ విషయంలో కోహ్లీనే ముందుంటాడు: జడేజా

సాధారణంగా క్రికెటర్లు మైదానంలో ఎంత అగ్రెసివ్ గా ఉంటారో.. బయట అంత జోవియల్ గా ఉంటారు. అయితే ఇది కొందరి క్రికెటర్లకే సాధ్యం అవుతుంది. కాగా.. టీమిండియా క్రికెటర్లు మైదానంలో ఎలా ఉంటారో అందరికి తెలిసిందే. కానీ గ్రౌండ్ నుంచి డ్రస్సింగ్ రూమ్ కు వచ్చాక, లైఫ్ లో ఎలా ఉంటారో చాలా తక్కువ మందికే తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా.. విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాపిడ్ ఫైర్ రౌండ్ లో టీమిండియా ఆటగాళ్ల గురించి పలు ఆసక్తిక విషయాలు వెల్లడించాడు. అన్నింటి కంటే ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఓ విషయంలో అందరికంటే ముందుంటాడని జడేజా చెప్పుకొచ్చాడు.

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరదాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సరదా.. సరదాగా ఆన్సర్స్ ఇచ్చాడు. అందులోని ఆసక్తిక ప్రశ్నలు, సమాధానాలు మీకోసం. టీమిండియాలో మోస్ట్ ఇంప్రూవ్డ్ గేమర్ ఎవరు అని అడగ్గా.. వెంటనే పుజారా అని ఆన్సర్ ఇచ్చాడు జడేజా. ఇక టీమ్ లో ఎవరి గడ్డం మంచిగా ఉంటుందంటే? విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పేర్లు చెప్పాడు. ఇషాంత్ కిషన్ ను ఫన్నీయెస్ట్ ఎంటర్ టైనర్ అని, మెసేజ్ లకు తొందరగా ఎవరు రిప్లై ఇస్తారు అంటే.. చాహల్ పేరు చెప్పుకొచ్చాడు.

ఇక టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ కోహ్లీ అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే అతడు డ్రస్సింగ్ రూమ్ లోకి రాగానే మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తాడు. అందుకే అతడికి డీజే అంటే ఇష్టం. విరాట్ ఎక్కువగా ఫన్నీగా ఆట పట్టిస్తుంటాడని ఈ రాపిడ్ ఫైర్ లో రవీంద్ర జడేజా చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ పాత వీడియో వైరల్ గా మారింది.

Show comments