T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచేది టీమిండియానే.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు!

టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచేది టీమిండియానే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచేది టీమిండియానే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

వన్డే వరల్డ్ కప్ 2023 ఓడిపోయి 140 కోట్ల మంది భారతీయులకు తీవ్ర నిరాశను మిగిల్చారు టీమిండియా సీనియర్ క్రికెటర్లు. ఇక ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారు అనుకున్న అండర్ 19 కుర్రాళ్లు కూడా అదే ఆస్ట్రేలియా చేతిలో అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయారు. దీంతో మరోసారి టీమిండియా అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక ఈ ఓటములకు బదులు తీర్చుకోవాలంటే.. జూన్ లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకోవాలి భారత్. ఇదే విషయంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2023లో ఓడిపోవడంపై మరోసారి స్పందించాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు.. టీమిండియాపై, రోహిత్ శర్మపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ కార్యక్రమంలో జై షా మాట్లాడుతూ..”రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను కచ్చితంగా గెలుచుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫార్మాట్ లో రాణించగల ఆటగాళ్లు జట్టులో చాలా మంది ఉన్నారు. ఇక ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్లో ఓడిపోయినప్పటికీ.. తమ ఆటతీరుతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. వరుసగా 10 మ్యాచ్ ల్లో నెగ్గి.. కప్ గెలవనప్పటికీ.. వారు హీరోలే” అంటూ చెప్పుకొచ్చాడు జై షా. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుంది అన్న జై షా కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: బుమ్రాపై దాడికి సిద్ధం.. మూడో టెస్ట్ కు ముందు స్టోక్స్ కీలక వ్యాఖ్యలు!

Show comments