Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌కు మరో బిగ్‌ షాక్‌! KL స్థానంలో తెలుగోడు ఫిక్స్‌!

టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్​ కిషన్​కు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న ఇషాన్​కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.

టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్​ కిషన్​కు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న ఇషాన్​కు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి.

ఇషాన్ కిషన్.. ఈ మధ్య కాలంలో టీమిండియా తరఫున బాగా రాణిస్తున్న యంగ్ క్రికెటర్లలో ఒకడు. వికెట్ కీపింగ్​తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్​తో మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. టీ20ల్లో రెగ్యులర్ ప్లేయర్​గా మారిన ఇషాన్.. వన్డేలు, టెస్టుల్లోనూ తనకు అవకాశం దొరికిన ప్రతిసారి బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతడి కెరీర్​ ప్రశ్నార్థకంగా మారింది. మానసిక ఒత్తిడి నుంచి రెస్ట్ కావాలంటూ టీమ్​కు దూరమయ్యాడు ఇషాన్. ఈ సమస్య వల్ల సౌతాఫ్రికా సిరీస్​ మధ్యలో నుంచి వెళ్లిపోయాడు. అయితే అతడు రెస్ట్ కోరితే.. బీసీసీఐ మాత్రం పూర్తిగా పక్కనపెట్టేసింది. ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​తో పాటు ఇంగ్లండ్​తో జరిగే టెస్ట్ సిరీస్​కు అతడ్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఏం చేయాలో ఇషాన్​కు పాలుపోవట్లేదు. ఈ తరుణంలో ఈ యంగ్ బ్యాటర్​కు మరో షాకింగ్ న్యూస్. కేఎల్ రాహుల్ నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కేఎస్ భరత్​కు అప్పగించనున్నారని తెలిసింది.

యాక్సిడెంట్ వల్ల రిషబ్ పంత్ టీమ్​కు దూరమవడంతో అతడి ప్లేసులో ఇషాన్ కిషన్​ను ఆడిస్తూ వచ్చింది భారత్. ఆ తర్వాత వికెట్ కీపింగ్ బాధ్యతల్ని కేఎల్ రాహుల్​కు అప్పగించింది. తెలుగు తేజం కేఎస్ భరత్ కూడా ఒక సిరీస్​లో కీపర్​గా ఉన్నాడు. అయితే అతడు రాణించకపోవడంతో రాహుల్, ఇషాన్​ను ఆ రోల్ కోసం సెలక్ట్ చేస్తూ వచ్చింది బీసీసీఐ. కానీ ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు మాత్రం ఇషాన్​ను ఎంపిక చేయలేదు. అతడి ప్లేసులో కేఎస్ భరత్​తో పాటు మరో తెలుగు కుర్రాడు, వికెట్ కీపర్ బ్యాట్స్​మన్ ధ్రువ్ జురెల్​ను జట్టులోకి తీసుకుంది. అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం.. కేఎల్ రాహుల్​ను స్పెషలిస్ట్ బ్యాటర్​గా ఆడిస్తారట. కీపింగ్ రెస్పాన్సిబిలిటీని భరత్​కు అప్పగించాలని టీమ్ మేనేజ్​మెంట్ డిసైడ్ అయిందట. వెన్ను నొప్పితో బాధపడుతున్న రాహుల్ ఇటీవలే సర్జరీ చేయించుకోవడంతో అతడి మీద ప్రెజర్ పడొద్దనే కీపింగ్​కు దూరంగా ఉంచుతున్నారట.

ఇక, భరత్​ను వికెట్ కీపర్​గా తీసుకుంటారనేది ఇషాన్​కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇంగ్లండ్​తో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించే టీమ్​లో అయినా కిషన్​కు ఛాన్స్ ఇస్తారా? లేదా దూరం పెడతారా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇదంతా తన సొంత తప్పుల వల్లే జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ చెబుతున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నానని చెప్పి పార్టీలు చేసుకోవడం, ‘కౌన్ బనేగా కరోడ్​పతి’ ప్రోగ్రామ్​కు బీసీసీఐకి చెప్పకుండా వెళ్లడం వల్లే అతడి కెరీర్​ ప్రశ్నార్తకంగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. చేసిన తప్పును ఒప్పుకొని, బుద్ధిగా ఉంటే తిరిగి కెరీర్​ను గాడిలో పెట్టుకోవచ్చని నెటిజన్స్ సూచిస్తున్నారు. అయితే ఇషాన్ ప్లేస్​లోకి టీమ్​లోకి వచ్చిన కేఎస్ భరత్ రాణిస్తే కిషన్ స్థానం గోవిందా అని మరికొందరు చెబుతున్నారు. మరి.. ఇషాన్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఆఫ్ఘాన్‌తో రెండో టీ20తో బరిలోకి కింగ్‌ కోహ్లీ! ముందున్న సవాళ్లు ఇవే!

Show comments