ఛాంపియన్స్ ట్రోఫీకి అతడ్ని ఎంపిక చేయం.. సెలెక్టర్ల సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్​లతో అన్ని జట్లు బిజీ అయిపోయాయి. నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీపై టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఈ తరుణంలో సెలెక్టర్లు సంచలన ప్రకటన చేశారు.

టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్​లతో అన్ని జట్లు బిజీ అయిపోయాయి. నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీపై టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఈ తరుణంలో సెలెక్టర్లు సంచలన ప్రకటన చేశారు.

టీ20 వరల్డ్ కప్-2024 ముగిసింది. ద్వైపాక్షిక సిరీస్​లతో అన్ని జట్లు బిజీ అయిపోయాయి. నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంట్ అయిన ఛాంపియన్స్ ట్రోఫీపై అన్ని టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. పొట్టి కప్పు నెగ్గిన టీమిండియాతో పాటు ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్​పై కన్నేశాయి. వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్​లో అంతటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీనే. కాబట్టి ఎలాగైనా ఈసారి కప్పు వదలొద్దని అన్నీ పట్టుదలతో ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్​ను చేజిక్కించుకున్న ఆనందంలో ఉన్న భారత్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ మీద గురి పెడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంకో కప్పుతో కెరీర్​ను మరింత చిరస్మరణీయం చేసుకోవాలని చూస్తున్నారు.

టీమిండియాతో పాటు టాప్ టీమ్ అయిన ఆస్ట్రేలియా కూడా ఛాంపియన్స్ ట్రోఫీపై ఫోకస్ చేస్తోంది. వన్డే ప్రపంచ కప్​-2023ని కైవసం చేసుకున్న ఆసీస్.. 50 ఓవర్ల ఫార్మాట్​లో ఛాంపియన్​గా ఉంది. అయితే రీసెంట్​గా జరిగిన పొట్టి కప్పులో సూపర్-8 నుంచే ఇంటిదారి పట్టడంతో ఆ జట్టు తీవ్రంగా విమర్శల పాలైంది. ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో కంగారూల ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గి తమ సత్తా ఏంటో చూపించాలని ఆసీస్ భావిస్తోంది. ఈ తరుణంలో ఆ దేశ చీఫ్​ సెలెక్టర్ జార్జ్ బెయిలీ సంచలన ప్రకటన చేశాడు. స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్​ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయమని వెల్లడించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అతడ్ని సెలెక్షన్​కు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశాడు.

‘మా దృష్టిలో వార్నర్ రిటైర్ అయిపోయాడు. అన్ని ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా ఆడి ఆటకు వీడ్కోలు పలికాడు. తన కెరీర్ విషయంలో అతడు హ్యాపీగా ఉండాలి. పాకిస్థాన్​లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి వార్నర్​ను ఎంపిక చేసే ఉద్దేశం మాకు లేదు’ అని బెయిలీ చెప్పుకొచ్చాడు. వన్డే వరల్డ్ కప్-2023తో 50 ఓవర్ల ఫార్మాట్​కు గుడ్​బై చెప్పాడు వార్నర్. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్​తో పొట్టి ఫార్మాట్​ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే వెళ్తూ వెళ్తూ అవసరమైతే ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్​గా మళ్లీ వస్తానంటూ చిన్న హింట్ ఇచ్చాడు. ఇదే విషయంపై తాజాగా సెలెక్టర్ బెయిలీ రియాక్ట్ అయ్యాడు. వార్నర్ కావాలనే అలా జోక్ చేశాడని అన్నాడు. ఆసీస్ క్రికెట్​కు వార్నర్ అపూర్వ సేవలు అందించాడని మెచ్చుకున్నాడు. మరి.. వార్నర్​ను ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేయమంటూ బెయిలీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments