నేపాల్ ప్లేయర్లకు బంపరాఫర్ ఇచ్చిన బడా కంపెనీ! వికెట్ కు లక్ష, సిక్స్ కు లక్ష..

  • Author Soma Sekhar Updated - 08:09 PM, Mon - 4 September 23
  • Author Soma Sekhar Updated - 08:09 PM, Mon - 4 September 23
నేపాల్ ప్లేయర్లకు బంపరాఫర్ ఇచ్చిన బడా కంపెనీ! వికెట్ కు లక్ష, సిక్స్ కు లక్ష..

ఆసియా కప్ 2023లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 4 దశకు చేరాలంటే.. తప్పక విజయం సాధించాలి నేపాల్ జట్టు. టీమిండియాతో జరగబోయే ఈ మ్యాచ్ కోసం నేపాల్ ఆటగాళ్లలో ఉత్తేజం నింపటానికి నేపాల్ లోని ఓ బడా కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్లేయర్లను ఎంకరేజ్ చేయడంలో భాగంగానే సదరు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేపాల్ కు చెందిన ప్రముఖ ఆర్ణ బీర్ కంపెనీ ఇండియాతో మ్యాచ్ కు ముందు నేపాల్ ఆటగాళ్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే?

ఆసియా కప్ లో భాగంగా టీమిండియా-నేపాల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సూపర్ 4కు అర్హత సాధించాలని చూస్తోంది నేపాల్ జట్టు. అయితే టీమిండియా లాంటి బలమైన జట్టును ఓడించడం అంటే మామూలు విషయం కాదు. దీంతో తమ ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపటానికి నేపాల్ కు చెందిన ఆర్ణ బీర్ కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటే? నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్ కు రూ. లక్ష రూపాయలు నజరాన ప్రకటించింది.

ఈ క్రమంలోనే బౌలర్లతో పాటుగా బ్యాటర్లకు కూడా మంచి ఆఫర్ ఇచ్చింది ఈ కంపెనీ. టీమిండియా బౌలర్లను ఎదుర్కొని కొట్టిన ప్రతీ సిక్స్ కు రూ. లక్ష చొప్పున ఇస్తానని ప్రకటించింది. అలాగే ఫోర్ బాదితే రూ. 25 వేల చొప్పున నజరానా ప్రకటించింది. ఇలాంటి ఆఫర్లతో తమ ప్లేయర్లను మోటివేట్ చేస్తోంది నేపాల్ కంపెనీ. మరి నేపాల్ కంపెనీ ఈ విధంగా ఆఫర్లు ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments