డైరెక్ట్ గా OTT లోకి శోభిత ధూళిపాళ్ల మూవీ ‘లవ్ సితార’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే ?

Shobhitha dhoolipaalla Love Sitar Movie In OTT : ఈ మధ్య కాలంలో నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు ఎక్కువయిపోయాయి. వెండితెర నటీ నటులు కూడా ఈ మధ్య కాలంలో ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో శోభిత ధూళిపాళ్ల నటించిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Shobhitha dhoolipaalla Love Sitar Movie In OTT : ఈ మధ్య కాలంలో నేరుగా ఓటీటీ లోకి వచ్చే సినిమాలు ఎక్కువయిపోయాయి. వెండితెర నటీ నటులు కూడా ఈ మధ్య కాలంలో ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో శోభిత ధూళిపాళ్ల నటించిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి రానుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వెండి తెరపై అలరించిన నటి నటులు.. ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఓటీటీ లో కూడా డైరెక్ట్ గా రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య పెరిగిపోతుంది. పైగా ఆ సినిమాలు ప్రేక్షకులను మరింత బాగా మెప్పిస్తూ.. మంచి వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక ప్రతి వారం ఓటీటీ లో కొత్త కంటెంట్ వస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి శోభిత ధూళిపాళ్ల నటించిన ఓ ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ.. ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుందో.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

శోభిత ధూళిపాళ్ల నటించిన ఈ సినిమా పేరు.. ‘లవ్ సితార’. ఎప్పటినుంచో టాక్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. కాగా ఈ సినిమాకు వందన్ కటారియా దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో శోభిత ధూళిపాళ్లతో పాటు.. రాజీవ్ సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించాడు. కాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. ఈ విషయాన్నీ జీ 5 సంస్థ.. శోభితా ధూళిపాళ్ల ఫోటోతో.. రివీల్ చేసింది. మూవీ అనౌన్స్మెంట్ తో పాటు… స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మూవీని సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. “లవ్, హార్ట్ బ్రేక్, సెల్ఫ్ డిస్కవరీకి సంబంధించిన కథ ఇది. సెప్టెంబర్ 27న లవ్ సితార జీ5లో ప్రీమియర్ అవుతుంది” అంటే ట్యాగ్ లైన్ తో.. జీ 5 ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతానికైతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ,ట్రైలర్ లు రిలీజ్ చేయలేదు. కానీ త్వరలోనే రిలీజ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ మూవీలో శోభితా, రాజీవ్‍తో పాటు శంకర్ ఇంద్రఛూడన్, రిజుల్ రే, సీమా సాన్వీ కూడా ప్రధాన పాత్రలలో నటించారు. నిజానికి ఏ మూవీ షూటింగ్ 2020 లోనే స్టార్ట్ అయింది. కాని అనేక కారణాల వలన ఇప్పటివరకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. నార్మల్ బడ్జెట్ తో ఉన్న రూపొందించిన ఈ మూవీలో లవ్ , కామెడీ , ఎమోషన్స్ తో పాటు.. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎలాగూ ఈ అమ్మడు మీద బజ్ బాగానే ఉంది కాబట్టి.. కచ్చితంగా ఓటీటీ లో ఈ మూవీ హిట్ కొట్టేస్తుంది. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments