iDreamPost
iDreamPost
ప్రముఖ హిందీ సీరియల్ నటి శ్రీతమ ముఖర్జీ పెళ్లిపీటలెక్కింది. ఇటీవలే శ్రీతమ ఆకాశ్ సాహ్నితో కలిసి ఏడుడుగులు వేసింది. జూన్ 23వ తేదీన ముంబైలోని స్టార్ హోటల్ లో ఇరుకుటుంబాల సభ్యులతో పాటు.. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. తన స్పెషల్ డే ను మరింత స్పెషల్ గా మార్చేందుకు శ్రీతమ ఎంతో అందంగా ముస్తాబైంది. ఎరుపు రంగు చీర కట్టి, బంగారు నగలు ధరించి, నుదుటన ఎర్రటి బొట్టు పెట్టి, జడ కొప్పు వేసుకుని పెళ్లి కూతురిగా సింగారించుకుంది. వరుడు కూడా ఆకాశ్ కూడా పేస్టల్ కలర్ షేర్వానీలో వధువుకి పోటీగా రెడీ అయ్యాడు. నూతన వధూవరులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
శ్రీతమ ముఖర్జీ.. ”దేఖా ఎక్ క్వాబ్”, ”కుచ్ తో హై తేరీ మేరే డర్మియాన్” సీరియల్స్ తో మంచి గుర్తింపు పొందారు. తన పెళ్లి గురించి శ్రీతమ ముఖర్జీ మాట్లాడుతూ.. ఆకాశ్ ను ఒక కామన్ స్నేహితుడి ద్వారా కలిసినట్లు తెలిపింది. ” ఓసారి బెంగళూరులో షూటింగ్ పూర్తి చేసుకుని ముంబై తిరుగు పయనమయ్యాను. ఆ సమయంలో నా డ్రైవర్ కు ఆరోగ్యం బాలేకపోవడంతో నా స్నేహితురాలు ఒక అబ్బాయిని పంపించింది. అతనే ఆకాశ్ సాహ్ని. అలా మేమిద్దరం స్నేహితులమయ్యాం. తర్వాత ప్రేమించుకున్నాం. ఏడేళ్లపాటు డేటింగ్ చేశాక.. ఇద్దరం కలిసి జూన్ 9న టీజీఎమ్ బ్యూటీ బ్రాండ్ ను ప్రారంభించాము. ఇప్పుడు బిజినెస్ పరంగానే కాదు.. జీవితంలోనూ భాగస్వాములం అయ్యాం” అని శ్రీతమ ముఖర్జీ తెలిపింది.