Pallavi Prashanth- Aata Sandeep: గాడి తప్పుతున్న పల్లవి ప్రశాంత్.. నోటికొచ్చింది మాట్లాడేస్తూ..!

Bigg Boss 7 Telugu: గాడి తప్పుతున్న పల్లవి ప్రశాంత్.. నోటికొచ్చింది మాట్లాడేస్తూ..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగానే సాగుతోంది. సోమవారం అనగానే హౌస్ లో నామినేషన్స్ హీట్ ఉంటుంది. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడమే కాకుండా.. తుప్పాస్ రీజన్స్ చెప్పావ్ అంటూ ఒకరిపై ఒకరు గొడవలకు దిగుతారు. ఈసారి హౌస్ లో గొడవలు గట్టిగానే అయ్యాయి. ఒకరిపై ఒకరు ఒంటికాలుపై దూకారు. నీది తప్పుడు రీజన్ అంటే నీది తప్పు అంటూ నానా యాగి చేశారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్- ఆట సందీప్ మధ్య పెద్ద గొడవే జరిగింది. వీళ్లు ఇద్దరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు ఆ సమయంలో వారి మధ్య జరిగిన వాదన చూస్తే.. పల్లవి ప్రశాంత్ కాస్త గాడి తప్పుతున్నాడు అనే భావన కలగకుండా ఉండదు.

ముందుగా పల్లవి ప్రశాంత్ ఆట సందీప్ ని నామినేట్ చేశాడు. ఆ సమయంలో నా కెప్టెన్సీ బాలేదు అన్నావ్ అది నాకు నచ్చలేదు. అంతేకాకుండా హే పో అంటూ నన్ను హేళన చేశావు. నన్ను తక్కువ చేసి మాట్లాడినవ్ అది నాకు నచ్చలేదు అంటూ రీజన్ చెప్పాడు. అందుకు సందీప్ చాలా కూల్ గానే సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. నీపై సినిమాల ప్రభావం బాగా ఉంది. నిన్ను చూస్తే నవ్వొస్తంది అంటూ సందీప్ అన్నాడు. ఆ తర్వాత నుంచి పల్లవి ప్రశాంత్ మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. వెటకారం చేస్తూనే సందీప్ కుండ పగలగొట్టాడు. సాధారణంగా నామినేషన్స్ అనగానే ప్రశాంత్ రెచ్చిపోతాడని అందరకీ తెలిసిందే. కానీ, ఈసారి మరీ ఓవర్ చేసినట్లు అనిపించింది. మధ్యలో పల్లవి ప్రశాంత్.. ఎవరు అని అడిగారు కదా.. పల్లవి ప్రశాంత్ అంటూ కేకలు వేశాడు.

ఆ తర్వాత టేస్టీ తేజాను నామినేట్ చేశాడు. ఆ సమయంలో కెప్టెన్ రూమ్ లోకి పర్మిషన్ అడిగి కదా రావాలి అంటూ క్లాస్ పీకాడు. అప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ అంటూ మళ్లీ కేకలు వేశాడు. తర్వాత ఆట సందీప్.. పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. ఆ సమయంలో కూడా పల్లవి ప్రశాంత్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. సందీప్ చాలా కూల్ గా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ, పల్లవి ప్రశాంత్ మాత్రం చాలా అంటే చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతూ వచ్చాడు. జనం మధ్యన కూర్చుని అన్ని ఎపిసోడ్లు చూశావ్ నీకు కెప్టెన్సీ అంటే తెలియదా అని నాగార్జున గారు ప్రశ్నించిన విషయాన్ని సందీప్ చెప్పుకొచ్చాడు. మధ్యలో మాట్లాడుతున్నాడు అని టెక్నికల్ గా చెప్తాను. ఓవర్ ల్యాప్ అవుతుందు ఇద్దరం మాట్లాడితే అంటాడు. అయితే అందుకు ప్రశాంత్ నేను కాదు ఓవర్ చేస్తోంది నువ్వే అంటూ వెటకారం చేశాడు.

అసలు సందీప్ ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని ప్రశాంత్ వినడం లేదు. అంతేకాకుండా సందీప్ తనని ఊరోడు అంటూ హేళన చేశాడు అంటూ ఆరోపించాడు. అందుకు సందీప్ బాగా హర్ట్ అయ్యాడు. నేను ఎప్పుడు అలా అన్నాను అంటే.. నువ్వు అన్నావ్. మస్త్ సార్లు అన్నావ్ అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఆ మాట అన్నాడు అని చాలాసార్లు చెప్పాడు. తర్వాత సందీప్ తనకు అన్నం పెట్టే నాట్యం మీద ఒట్టు వేసి అనలేదు అని చెప్పాడు. ఆ తర్వాత ప్రశాంత్ ని భూమి మీద, తినే అన్నం మీద ఒట్టేసి చెప్పు అంటూ సందీప్ డిమాండ్ చేస్తాడు. అందుకు ప్రశాంత్ మాట మారుస్తాడు. కానీ, ఒట్టు మాత్రం వేయడు. తినే అన్నం మీద, భూమి మీద బుద్ధి ఉన్న వాడు ఎవడూ ఒట్టు వేయడు అంటూ తప్పించుకునే ప్రయత్న చేశాడు. అంతేకాకుండా అసలు ఊరోడు అనే మాట నేను వాడలేదు.. ఆ అర్థంలో వచ్చేలా చెప్పాను అన్నాడు.

దాంతో సందీప్ కే కాదు.. ప్రేక్షకులు, ఆడియన్స్ కి కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు తాను ఆ పదమే వాడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సందీప్ అందరినీ రిక్వెస్ట్ చేశాడు. ప్లీజ్ వాడు ఊరోడు అనే మాట వాడాడా లేదా అంటూ అడిగాడు. అందుకు శీవాజీ రియాక్ట్ అయ్యాడు. నువ్వు ఊరోడు అనే మాట వాడావు. నీ నోటి నుంచి ఆ మాట వచ్చింది అని చెప్పాడు. నేరుగా శివాజీ చెప్పడంతో ప్రశాంత్ తప్పించుకోలేకపోయాడు. ఇదంతా చూసిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఆట గాడి తప్పినట్లు కనిపిస్తోంది. రైతు బిడ్డ అనే ట్యాగ్ ని సింపథీ కోసం వాడుకోవడం దగ్గరి నుంచి.. తప్పు చేసి సమర్థించుకోవడం కోసం వాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి.. సందీప్- ప్రశాంత్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments