ప్రేమ పెళ్లి.. ఏడాదికే భర్తను కోల్పోయిన సీరియల్ నటి

  • Author Soma Sekhar Published - 07:12 PM, Thu - 3 August 23
  • Author Soma Sekhar Published - 07:12 PM, Thu - 3 August 23
ప్రేమ పెళ్లి.. ఏడాదికే భర్తను కోల్పోయిన సీరియల్ నటి

ఆమె ఓ బుల్లితెర నటి. పలు సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. ఇక తన ప్రియుడినే ప్రేమ వివాహం చేసుకుని ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపాలనుకుంది. కానీ విధి ఆమె తల రాతను వేరేవిధంగా రాసిందేమో.. ఆమె జీవితంలో విషాదం నింపింది. ప్రేమానురాగాలతో ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ దంపతులను చూసి విధికి కన్నుకుట్టిందేమో.. అందుకే పెళ్లైన ఏడాదికే ఆమె భర్తను మృత్యువు కబళించింది. గుండెపోటుతో సీరియల్ నటి భర్త మరణించడంతో.. ఆమె గుండెలు పగిలేలా రోదించింది.

శృతి షణ్ముగప్రియ.. తమిళ బుల్లితెర నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. వాణి రాణి, కల్యాణ పరిసు, పొన్నుచల్, భారతీ కన్నమ్మ లాంటి సీరియల్స్ లో నటించింది శృతి. సీరియల్స్ చేస్తున్న క్రమంలోనే బాడీ బిల్డర్ అరవింద్ శేఖర్ తో ప్రేమలో పడి, ఇద్దరు కొన్నేళ్లపాటు డేటింగ్ చేశారు. ఇక గతేడాది మే నెలలో ఈ ప్రేమ జంట పెళ్లితో ఒక్కటైయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వీరు చేసే రీల్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఫుల్ గానే ఉంది. అయితే శృతి భర్త అరవింద్ శేఖర్ (30) బుధవారం (ఆగస్టు 2)న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దాంతో గుండెలు పగిలేలా ఏడ్చారు శృతి. పెళ్లైన ఏడాదికే భర్త చనిపోవడం.. చూపరులను కూడా కంటతడి పెట్టిస్తోంది. కాగా.. ఇంత చిన్న వయసులోనే అరవింద్ మరణం బాధాకరమని సోషల్ మీడియా వేదికగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అరవింద్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థిస్తున్నారు.


ఇదికూడా చదవండి: హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ కూతురు! ఆమె ఎవరంటే?

Show comments