క్రేజీ న్యూస్.. ఒకే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ఇద్దరు వారసులు!

క్రేజీ న్యూస్.. ఒకే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ఇద్దరు వారసులు!

ఇద్దరు సెలబ్రిటీల వారసులు ఒకే సినిమాతో హీరో, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి నట వారసులు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇద్దరు సెలబ్రిటీల వారసులు ఒకే సినిమాతో హీరో, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి నట వారసులు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

చిత్ర పరిశ్రమలోకి వారసులు రావడం కొత్తేం కాదు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారందరూ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. కొందరు వరుస విజయాలతో దూసుకెళ్తే.. మరికొందరు అపజయాలు సాధించి కెరీర్ ను ముగించిన వారున్నారు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు సెలబ్రిటీల వారసులు ఒకే సినిమాతో హీరో, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఆ సెలబ్రిటీలు ఎవరు? వారి నట వారసులు ఎవరు? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకే సినిమాతో ఇద్దరు సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అందులో ఒకరు ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే.. వనితా విజయ్ కుమార్ ఆమె మాజీ భర్త ఆకాశ్ కు పుట్టిన కొడుకు విజయ్ శ్రీహరి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇక ఇదే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది తమిళ స్టార్ డైరెక్టర్ ప్రభు సాల్మన్ కూతురు హేజల్ షైనీ. వీరిద్దరు జంటగా ప్రభు సాల్మన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ డైరెక్టర్ గతంలో చాలా మందిని పరిశ్రమకు పరిచయం చేశాడు.

అందులో కొక్కి మూవీతో కరణ్ ను, మైనాతో అమలాపాల్, కుంకీతో విక్రమ్ ప్రభులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వీరితో పాటుగా ‘కాయల్’ చిత్రంతో ఆనందికి కూడా మంచి గుర్తింపు వచ్చేలా చేశాడు. ఇక ఇప్పుడు తన కూతురిని కూడా అలాగే ఇండస్ట్రీకి తీసుకురావాలని ఫిక్సైయ్యాడట ప్రభు సాల్మాన్. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో సింహం ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం  ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. మరి ఒకే మూవీతో ఇద్దరు వారసులు పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments