Animal Movie Business: తెలుగు రాష్ట్రాల్లో యానిమల్‌ బిజినెస్‌.. బ్రేక్‌ ఈవెన్‌ ఎంతంటే..

తెలుగు రాష్ట్రాల్లో యానిమల్‌ బిజినెస్‌.. బ్రేక్‌ ఈవెన్‌ ఎంతంటే..

యానిమల్‌ సినిమాకు దేశ వ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ ఉంది. ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్‌కు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి బిజినెస్‌ జరిగింది...

యానిమల్‌ సినిమాకు దేశ వ్యాప్తంగా సూపర్‌ క్రేజ్‌ ఉంది. ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా లెవెల్‌లో డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్‌కు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి బిజినెస్‌ జరిగింది...

యానిమల్‌ సినిమా కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావటానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. డిసెంబర్‌ 1వ తేదీన ఈ మూవీ దేశ వ్యాప్తంగా రిలీజ్‌ అవ్వనుంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. యానిమల్‌కు హిందీతో పాటు తెలుగులోనూ సమానమైన క్రేజ్‌ ఉంది. అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా నుంచి వస్తున్న రెండో సినిమా కావటంతో తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా యానిమల్‌ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక, రణబీర్‌ కపూర్‌తో సందీప్‌ సినిమా ప్రకటించిన నాటి నుంచి అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రం నుంచి వచ్చిన ఒక్కో అప్‌డేట్‌ యానిమల్‌పై అంచనాలను పెంచుతూ పోయింది. ఇప్పుడు ఆ అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. భారీ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు తెలుగులో మంచి బిజినెస్‌ జరిగింది. యానిమల్‌ను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు 15 కోట్ల రూపాయలకు కొనుక్కున్నట్లు తెలుస్తోంది.

మొత్తం బిజినెస్‌ వివరాల్లోకి వెళితే.. నైజాం, ఉత్తరాంధ్రల్లో 9 కోట్ల రూపాయల బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో దాదాపు ఆరు కోట్ల రూపాయల బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ చిత్రం 16 కోట్ల రూపాయల బిజినెస్‌ చేస్తే బ్రేక్‌ ఈవెన్‌ అందుకున్నట్లు. మొదటి రోజు యానిమల్‌ 15 కోట్ల రూపాయల గ్రాస్‌ సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా పాజిటివ్‌ టాక్‌ వస్తే.. రెండు రోజుల్లోనే ఈ బ్రేక్‌ ఈవెన్‌ బ్రేక్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

 ఇక, సినిమా టీం తెలుగులో యానిమల్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేస్తోంది. హీరో, హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలు, టీవీ షోలలో పాల్గొంటున్నారు. నిన్న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ  కార్యక్రమానికి ప్రముఖ హీరో మహేష్‌ బాబు, దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సినిమాకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని మరీ, మరీ చెప్పారు.

కాగా, యానిమల్‌ సినిమాలో రణబీర్‌ కపూర్‌కు జంటగా.. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న నటించారు. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, పృద్ధ్వీరాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక, యానిమల్‌కు తెలుగు వ్యక్తి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ మ్యూజిక్‌ అందించారు. అన్ని పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో దుమ్ము దులుపుతున్నాయి. మరి, యానిమల్‌ సినిమా బిజినెస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments