Allu Arjun: మరింత పెరిగిన అల్లు అర్జున్ క్రేజ్! మరో అరుదైన ఘనత!

అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. తాజాగా ఓ ఘనత కారణంగా బన్నీ క్రేజ్ మరింత పెరిగింది.

అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తోంది. తాజాగా ఓ ఘనత కారణంగా బన్నీ క్రేజ్ మరింత పెరిగింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6న పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. తాజాగా బన్నీ క్రేజ్ మరింత పెరిగింది. తమ అభిమాన హీరో మరో ఘనత సాధించాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

అల్లు అర్జున్.. ఒక పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క యాడ్స్ లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పటికే రెడ్ బస్ యాడ్ లో నటించిన బన్నీ.. తాజాగా మరో యాడ్ లో కనిపించబోతున్నాడు. ‘థమ్స్ అప్’యాడ్ బన్నీ చేతికి వచ్చింది. స్టార్ హీరోలను కాదని బన్నీ ఈ యాడ్ దక్కించుకోవడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు థమ్స్ అప్ యాడ్ లో కనిపించి సందడి చేశారు. ఇక ఇప్పుడు బన్నీ ఈ యాడ్ లో మెరవబోతున్నాడు. దాంతో తమ హీరో అరుదైన ఘనత సాధించాడని, మరింత క్రేజ్ పెరిగిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్ లో బన్నీ ఏ రేంజ్ స్టంట్స్ చేస్తాడో చూడాలని క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. కాగా.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు ఐకాన్ స్టార్. త్వరలోనే షూటింగ్ ముగించుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకుని ప్రమోషన్స్ చేపట్టాలని మేకర్స్ ప్లాన్స్ వేస్తున్నారు. మరి బన్నీ థమ్స్ అప్ యాడ్ చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments