Virat Kohli Wins IPL 2024 Orange Cap: కప్పు మిస్సైనా కోహ్లీ ఖాతాలో క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

కప్పు మిస్సైనా కోహ్లీ ఖాతాలో క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలో ఇదే ఫస్ట్ టైమ్!

ఐపీఎల్-2024లో ఛాంపియన్​గా ఆవిర్భవించింది కోల్​కతా నైట్ రైడర్స్. అయితే కప్పు మిస్సైనా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ క్రేజీ రికార్డ్ చేరింది. ఇలా జరగడం ఇన్నేళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.

ఐపీఎల్-2024లో ఛాంపియన్​గా ఆవిర్భవించింది కోల్​కతా నైట్ రైడర్స్. అయితే కప్పు మిస్సైనా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ క్రేజీ రికార్డ్ చేరింది. ఇలా జరగడం ఇన్నేళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.

ఐపీఎల్-2024 ముగిసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ను ఓడించింది కోల్​కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్​లో 8 వికెట్ల భారీ తేడాతో నెగ్గిన అయ్యర్ సేన కొత్త ఛాంపియన్​గా అవతరించింది. ఈ మ్యాచ్​లో ముందు బ్యాటింగ్ చేసిన ఎస్​ఆర్​హెచ్​ ఓవర్లన్నీ ఆడలేకపోయింది. 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కీలకమైన 2 వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీ వెన్ను వెరిచిన మిచెల్ స్టార్క్​కు ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ ఆసాంతం బ్యాట్​, బాల్​తో రఫ్ఫాడించిన సునీల్ నరైన్​కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారం లభించింది. ఇక, కప్పు మిస్సైనా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఐపీఎల్-2024 ఆరెంజ్ క్యాప్​ను గెలుచుకున్నాడు కోహ్లీ. ఈ సీజన్​లో 15 మ్యాచుల్లో 154 స్ట్రైక్ రేట్​తో 741 పరుగులు చేశాడు విరాట్. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో రెండోసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్​కు కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరెంజ్ క్యాప్​ను అందుకున్నాడు. అవార్డు ప్రెజెంటేషన్ టైమ్​లో కోహ్లీ పేరు చెప్పగానే స్టేడియంలోని అభిమానులు గట్టిగా అరిచారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయ్యర్ వచ్చి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాక కూడా విరాట్ నామస్మరణ ఆగలేదు. ఇది చూసిన నెటిజన్స్.. కోహ్లీ క్రేజ్​కు ఇది నిదర్శనమని అంటున్నారు. అతడు స్టేడియంలో లేకున్నా ఫ్యాన్స్ చూపించిన ప్రేమ అపురూపమని చెబుతున్నారు.

ఇక, ఈ సీజన్​లో ఆర్సీబీ జట్టు అదరగొట్టింది. టోర్నీ ఫస్టాఫ్​లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఆ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. ప్లేఆఫ్స్ సంగతి తర్వాత పాయింట్స్ టేబుల్​లో లాస్ట్​లో ఉండకపోతే అదే గొప్పని ఫిక్స్ అయ్యారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ డుప్లెసిస్ సేన అద్భుతంగా ఫైట్​బ్యాక్ చేసింది. వరుసగా 6 మ్యాచుల్లో విజయాలు సాధించి దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. నాకౌట్ మ్యాచ్​లో సీఎస్​కేకు పంచ్ ఇచ్చింది. దీంతో ఈసారి ఫైనల్స్​కు వెళ్లి కప్ ఒడిసిపట్టడం పక్కా అని ఎక్స్​పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ఎలిమినేటర్​లో ఆర్సీబీ కథను ముగించింది రాజస్థాన్ రాయల్స్. దీంతో మరోసారి కప్పు మిస్సైందని ఆ టీమ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అయితే ట్రోఫీ చేజారినా కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ దక్కడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

Show comments