రోజూ రాత్రిపూట భర్త టార్చర్! ఈ మహిళ ఇలా చేసిందేంటి?

రోజూ రాత్రిపూట భర్త టార్చర్! ఈ మహిళ ఇలా చేసిందేంటి?

రుక్మాబాయి, సుదర్శన్ దంపతులు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా కాపురాన్ని కొనసాగించారు. ఈ దంపతులు గ్రామంలో కూలీ, నాలి పని చేస్తూ ఉండేవారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే భర్త తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. రోజూ రాత్రుల్లో భార్యను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. ఇదే విషయంపై తరుచు ఇద్దరు గొడవ పడేవారు. ఇక భర్త వేధింపులను సహించలేని ఈ మహిళ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామం. ఇక్కడే సుదర్శన్- రుక్మాబాయి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా బతికారు. ఇకపోతే, కొన్ని రోజుల తర్వాత భర్త సుదర్శన్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొస్తూ ఇంట్లో భార్యతో గొడవకు దిగేవాడు. మద్యం తాగొద్దని భార్య రుక్మాబాయి ఎన్నో సార్లు భర్తకు చెప్పి చూసింది. అయినా లెక్క చేయని సుదర్శన్.. రోజూ మద్యం సేవించి భార్యను టార్చర్ పెట్టేవాడు.

భర్త వేధింపులను భార్య రుక్మాబాయి తట్టుకోలేకపోయింది. ఇలాంటి బతుకు నాకు వద్దు అనుకుందో ఏమో కానీ.. ఈ నెల 9న రుక్మాబాయి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం మృతురాలి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి రుక్మాబాయి బలవన్మరణానికి పాల్పడడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

ఇది కూడా చదవండి: భర్తను వదిలేసి ప్రియుడితో ఎఫైర్! మూడేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటూ..!

Show comments