iDreamPost

పోలీసులకు లొంగిపోయిన టీడీపీ సీనియర్‌ నేత

పోలీసులకు లొంగిపోయిన టీడీపీ సీనియర్‌ నేత

శ్రీకాకుళం టీడీపీ సీనియర్‌ నేత, చంద్రబాబు ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన కూన రవికుమార్‌ పోలీసులకు లొంగిపోయారు. సరుబుజ్జిలి ఈవోపీఆర్డీని దూషించిన కేసులో కూన రవికుమార్‌పై పోలీసులకు ఫిర్యాదులందాయి. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కూన రవికుమార్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

కూన రవికుమార్‌ గతంలోనూ ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడారు. ఆ సమయంలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆయన అదే తీరుతో వ్యవహరించడంపై ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూన రవికుమార్‌పై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రవికుమార్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బొప్పరాజు హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి