Dharani
అల్సర్.. ఈ సమస్య బారిన పడ్డామంటే.. ఇక ఏం తినాలన్నా సరే భయపడాల్సి వస్తుంది. తింటే ఒక బాధ.. తినకపోతే మరో సమస్య. మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఉంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ వివరాలు..
అల్సర్.. ఈ సమస్య బారిన పడ్డామంటే.. ఇక ఏం తినాలన్నా సరే భయపడాల్సి వస్తుంది. తింటే ఒక బాధ.. తినకపోతే మరో సమస్య. మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఉంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ వివరాలు..
Dharani
మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా.. చిన్న వయసులోనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. ఇక నేటి కాలంలో చాలా మందిని పట్టి పీడిస్తోన్న అతి సామాన్యమైన సమస్య గ్యాస్ట్రిక్ అల్సర్. ఒక్కసారి దీని బారిన పడ్డామంటే.. ఏం తినాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఏ ఆహారం తీసుకుంటే.. కడుపులో మంటగా ఉంటుందో తెలియక.. ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంతకు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే.. మన జీర్ణవ్యవస్థలో ఒక నిర్ణీత పరిమాణంలో యాసిడ్ అవసరం. జీర్ణవ్యవస్థలో ఈ యాసిడ్ ఎక్కువైనా, తక్కువైనా అల్సర్లు తయారవుతాయి. హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా కూడా అల్సర్స్కు కారణమవుతుంది. 80 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అల్సర్లు వస్తాయి అంటున్నారు నిపుణులు.
అల్సర్ సమస్యని ఆయుర్వేదంలో ఆమ్ల పిత్తమని అంటారు. గుండెల్లో మంటగా ఉండడం, ఆహారం తినకపోతే మంటగా అనిపించడం, తిన్న తరువాత కడుపులో నొప్పి రావడం వంటి లక్షణాలు అల్సర్ని సూచిస్తాయి. ఈ సమస్యలన్నిటికీ చిన్న చిన్న చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
పైన చెప్పిన చిట్కాలను పాటిస్తూ.. కొన్ని రోజుల పాటు కారం వస్తువులు, మసాలాలు, జున్ను, మినపపప్పు, పెరుగు, పుల్లని పదార్థాలను తినడం మానేశాయి. మజ్జిగ, వేయించి వండిన మెత్తని అన్నం, పెసరకట్టు, దానిమ్మ రసం, బెల్లం, పాలు వంటివి మేలు చేస్తాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.