iDreamPost

OTTలోకి వచ్చేస్తున్న మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Apr 03, 2024 | 11:18 AMUpdated Apr 03, 2024 | 11:18 AM

ఓటీటీ లో క్రైమ్, సస్పెన్స్ అండ్ మిస్టరీ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లోకి మరొక మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

ఓటీటీ లో క్రైమ్, సస్పెన్స్ అండ్ మిస్టరీ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లోకి మరొక మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

  • Published Apr 03, 2024 | 11:18 AMUpdated Apr 03, 2024 | 11:18 AM
OTTలోకి వచ్చేస్తున్న మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

క్రైమ్ మూవీస్, కామెడీ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలా జోనర్ తో సంబంధం లేకుండా.. తెలుగు, తమిళం, మలయాళం అనే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలకు, సిరీస్ లకు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చాలా వరకు ప్రేక్షకులు.. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్స్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు, ఈ క్రమంలో మరొక మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. గతంలో సైలెన్స్ పేరుతో వచ్చిన సినిమాకు సిక్వెల్ గా ఇప్పుడు “సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్” పేరుతో .. ఓటీటీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎప్పటినుంచి.. ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

జీ5 ఓటీటీలో 2021లో సైలెన్స్ మూవీ వచ్చింది. ఆ సినిమాను అబన్ బరూచా దేవ్‌హన్స్ డైరెక్ట్ చేశారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అయిన కారణంగా ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ గా .. “సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్” ను విడుదల చేయనున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రాచీ దేశాయ్ కలిసి ఈ సినిమాలో నటించారు. అలాగే జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇక పార్ట్ -1 ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో.. ఇప్పుడు పార్ట్-2 కూడా అంతకు మించి ఉండబోతున్నట్లు.. ట్రైలర్ లో చూపించేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ జీ5 ఓటీటీ లో ఏప్రిల్ 2 రాత్రి రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 16 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. సైలెన్స్ మూవీలో ఏసీపీ అవినాష్ వర్మ పాత్రలో నటించిన మనోజ్.. ఈ సిక్వెల్ లో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈ సినిమాను అసలు మిస్ కాకూడదు.

Another murder mystery thriller coming to OTT

ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఎలా ఉందంటే.. ఈ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. నైట్ ఔల్ అనే బార్ లో జరిగిన షూటౌట్ తో ఈ ట్రైలర్ కు తెర తీశారు. దీనిని సాల్వ్ చేయడానికి అవినాష్ అండ్ టీం రంగంలోకి దిగుతారు. అక్కడ ఎం జరిగింది అన్న విషయాన్నీ అవినాష్ వివరిస్తూ ఉంటాడు. కానీ, అక్కడ ఒక అమ్మాయిని ముందు ఉంచి. ఆ షూటర్ ఎందుకు కాల్చాడు అన్న ప్రశ్న దగ్గర వారు ఆగిపోతారు. అసలు ఆ అమ్మాయి ఎవరు ! ఆమెను ఎందుకు హత్య చేశారు అని విచారణ చేపడతారు. ఆ కేసును సాల్వ్ చేసే క్రమంలో వారికీ అనుకోని ట్విస్ట్ లు ఎదురౌతూ ఉంటాయి. వాటిని డీల్ చేస్తూ.. ఈ టీం ఆ కేసును ఎలా సాల్వ్ చేశారో తెలుసుకోవాలంటే.. ఈ సినిమా రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాలి. మరి, ఈ సినిమా ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి