iDreamPost

మహేష్ తర్వాత మరో స్పెషల్ సెలబ్రిటీ

మహేష్ తర్వాత మరో స్పెషల్ సెలబ్రిటీ

మధ్యలో కొంత డల్ గా సాగుతున్నట్టు అనిపించినా ఫైనల్ గా ఎవరు మీలో కోటీశ్వరులు బాగానే రన్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హోస్టింగ్ మీద ఎలాంటి కంప్లయింట్స్ లేవు కానీ క్విజ్ లకు పెద్దగా ఆదరణ లేని ఈ రోజుల్లో ఇంత మాత్రం టిఆర్పి వస్తోందంటే దానికి తారక్ క్రేజ్ అండ్ స్కిల్స్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. మధ్యమధ్యలో సెలబ్రిటీ గెస్టులను తీసుకొస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ వచ్చిన ఎపిసోడ్లకు బ్రహ్మాండమైన స్పందన దక్కింది. త్వరలో మహేష్ బాబుది కూడా టెలికాస్ట్ కాబోతోంది. దసరాకు రాబోయే ఈ భాగం ట్రైలర్ ఈ రోజో రేపో వదలబోతున్నారు.

ఇదిలా ఉండగా త్వరలో ఈ షోలో సమంతా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నట్టు టీవీ వర్గాల కథనం. ఇంతకు ముందే అడిగారని తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. నాగ చైతన్యతో విడాకుల వ్యవహారం వల్ల మీడియాతో పాటు జనాల నోళ్ళలో నానిన సామ్ ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనేమి తప్పు చేయలేదు. పరస్పర ఒప్పందంతోనే ఇద్దరూ విడిపోయారు. చైతు ఆల్రెడీ నార్మల్ అయిపోయి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తన రెగ్యులర్ వర్క్ స్టార్ట్ చేసేసాడు. సో సమంతా ఒక్కతే అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం లేదు.దానికి ఎవరు మీలో కోటీశ్వరులు లాంటివి మంచి వేదికలు

ఎలాగూ తారక్ అనుమతి లేకుండా సామ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సంగతులు అడగడు. సో సమంతా ఏదైనా చెప్పాలనుకుంటే నో చెప్పరు. ఈ ఇద్దరి కాంబోలో బృందావనం, జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాలు వచ్చాయి. మొదటి రెండు భారీ హిట్లు కూడా. సో కెమిస్ట్రీ పరంగా ఇద్దరి జోడి ఈ క్విజ్ షోకు ఆకర్షణగా మారుతుంది. అధికారికంగా ఇది చెప్పలేదు కానీ అంతర్గతంగా వచ్చిన సమాచారం మేరకు ఫిలిం నగర్ టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ 5 గట్టి పోటీ అవుతుందేమో అనుకుంటే అంచనాలకు భిన్నంగా ఎవరు మీలో కోటీశ్వరులే దూసుకుపోతుండటం గమనార్హం

Also Read : పొలిటికల్ గేమ్ ఆడిస్తున్న ప్రెసిడెంట్ గిరి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి