iDreamPost

వరల్డ్ కప్​కు ముందు రోహిత్​కు షాక్ ఇచ్చిన దొంగలు!

  • Author singhj Published - 08:53 AM, Fri - 29 September 23
  • Author singhj Published - 08:53 AM, Fri - 29 September 23
వరల్డ్ కప్​కు ముందు రోహిత్​కు షాక్ ఇచ్చిన దొంగలు!

టీమిండియా కెప్టెన్ రోహిత్​ శర్మ గ్రౌండ్​లో ఎంతో యాక్టివ్​గా ఉంటాడు. బ్యాటింగ్​తో పాటు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలోనూ సహచరులను ఉత్సాహపరుస్తూ ఉంటాడు. మ్యాచ్ ఎలా గెలవాలి? ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలనే దానిపై వ్యూహాలు పన్నుతూ ఉంటాడు. అలాంటి రోహిత్​కు మతిమరుపు సమస్య ఉందని తెలుసా? అవును. ఈ విషయాన్ని అతడి సహచర ప్లేయర్ విరాట్ కోహ్లీ గతంలో ఒక సందర్భంలో వెల్లడించాడు. యూట్యూబర్ గౌరవ్ కపూర్ షోలో విరాట్ మాట్లాడుతూ.. రోహిత్​కు మతిమరుపు ఎక్కువని చెప్పాడు. అతడు మర్చిపోయినన్ని వస్తువులు ఇంకెవరూ మర్చిపోరన్నాడు.

ఒక్కటని కాదు.. ఐఫోన్, ఐపాడ్, వాలెట్ లాంటివి చాలాసార్లు రోహిత్ మర్చిపోయాడని.. రెండు, మూడు సార్లయితే హోటల్ రూమ్​లోనే తన పాస్​పోర్ట్​ను కూడా మర్చిపోయాడని తెలిపాడు. వీటిని వెతికి పట్టుకునేందుకు తమకు తలప్రాణం తోకకు వచ్చిందన్నాడు. చిన్నచిన్న వస్తువుల్ని రోహిత్ పట్టించుకోడని అన్నాడు. ఇటీవల ఆసియా కప్ సమయంలో కూడా లంక నుంచి భారత్​కు తిరిగొస్తుండగా హిట్​మ్యాన్ తన పాస్​పోర్ట్ మర్చిపోయాడు. ఆ పాస్​పోర్ట్​ను టీమిండియా సపోర్ట్ స్టాఫ్ మెంబర్ ఒకరు వెతికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో నెట్టింట వైరల్​గా మారింది.

ఇప్పుడు రోహిత్ మరో వస్తువును పోగొట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఆడిన ఆఖరి వన్డేలో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​ ప్రారంభానికి ముందు రోహిత్ పర్సనల్ ఐఫోన్ పోయిందట. ఇది దొంగతనానికి గురైందని సమాచారం. తరచూ వస్తువులు మర్చిపోయే అలవాటు ఉన్న హిట్​మ్యాన్.. ఫోన్​ను కూడా మర్చిపోయాడేమోనని కొందరు అంటున్నారు. నెట్స్​లో ప్రాక్టీస్ చేస్తున్న టైమ్​లోనే అతడి మొబైల్ పోయిందట. అయితే దీన్ని లైట్ తీసుకున్న రోహిత్.. ఆసీస్​పై తనదైన స్టైల్​లో చెలరేగి బ్యాటింగ్ చేశాడు. అయినా మ్యాచ్​ను గెలిపించలేకపోయాడు.

ఇదీ చదవండి: క్రికెట్​లో అందాల దేవత.. హీరోయిన్లను మించిన అందం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి