iDreamPost

రష్మిక మందన్నకు షాక్‌.. ఆగిపోయిన ఆ భారీ ప్రాజెక్ట్‌!

రష్మిక మందన్నకు షాక్‌.. ఆగిపోయిన ఆ భారీ ప్రాజెక్ట్‌!

స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న దృష్టి ఇప్పుడు హిందీ సినిమాలపైనే ఉంది. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు ఆమె సౌత్‌ సినిమాలను సైతం పక్కన పెడుతున్నారు. పుష్ప సినిమా సాధించిన విజయంతో రష్మికకు హిందీలో వరుస అవకాశాలు రావటం మొదలైంది. 2022లో వచ్చిన ‘గుడ్‌ బై’ అనే సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించారు. తర్వాత ఆమె మిషన్‌ మంజు అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటించారు.

ఈ సమయంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో నటించే అవకాశం రష్మికను వరించింది. అర్జున్‌ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అనిమల్‌’ అనే సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌కు జంటగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రష్మికకు బాలీవుడ్‌లో మరో స్టార్‌ హీరో అయిన షాహిద్‌ కపూర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇదే సమయంలో ఆమెకు తెలుగులో నితిన్‌తో కలిసి నటించే అవకాశం కూడా వచ్చింది.

అయితే, డేట్స్‌ లేని కారణంగా నితిన్‌తో సినిమా కాదని, షాహిద్‌ కపూర్‌తో సినిమా చేయటానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. షాహిద్‌ సినిమాతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందామని ఆమె భావించారు. తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలుస్తాడు అన్నట్లు.. ఆమె అనుకున్నది ఒకటి అయితే.. జరిగింది ఒకటి. షాహిద్‌ కపూర్‌తో మొదలుకావాల్సిన సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఈ సినిమా ఆపేశారంట. బడ్జెట్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఈ సినిమాను ఆపేపినట్లు సమాచారం. మరి, రష్మిక హిందీ సినిమా ఆగిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి