iDreamPost

మనీ వేటలో రాజమౌళి కొడుకు! మంచి ప్లాన్స్ వేస్తున్నాడుగా!

  • Published Mar 20, 2024 | 12:37 PMUpdated Mar 20, 2024 | 12:37 PM

రీసెంట్ గా సూపర్ సక్సెస్ సాధించిన మలయాళీ డబ్బింగ్ మూవీ ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేసి.. హిట్ కొట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ. ఇక ఇప్పుడు కార్తికేయ మరో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.

రీసెంట్ గా సూపర్ సక్సెస్ సాధించిన మలయాళీ డబ్బింగ్ మూవీ ప్రేమలు సినిమాను తెలుగులో రిలీజ్ చేసి.. హిట్ కొట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ. ఇక ఇప్పుడు కార్తికేయ మరో రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.

  • Published Mar 20, 2024 | 12:37 PMUpdated Mar 20, 2024 | 12:37 PM
మనీ  వేటలో రాజమౌళి కొడుకు! మంచి ప్లాన్స్ వేస్తున్నాడుగా!

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. ఈ దర్శకుడు తన సినిమాలతో ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేస్తారు. అది కూడా వరల్డ్ వైడ్ గా. ఇటీవల జపాన్ లో జరిగిన ఈవెంట్ లో రాజమౌళికి దక్కిన గౌరవం గురించి .. ఇప్పటికే ఎన్నో వార్తలలో చూస్తూ వచ్చాము. ఈ క్రమంలో ఆయన తనయుడు కార్తికేయ కూడా సినీ రంగంలో తన సత్తా చూపించుకునేందుకు రెడీ అయ్యాడు. ప్రేమలు సినిమాను తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేసి.. హిట్ కొట్టేశాడు కార్తికేయ. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టనున్నాడు రాజమౌళి తనయుడు.

తెలుగులో “ఆక్సిజన్”, “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” సినిమాలతో.. నిర్మాణ రంగంలో అడుగుపెట్టనున్నారు కార్తికేయ. ఆర్కా మీడియా వర్క్స్ పైన .. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన.. నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి.. కార్తికేయ ఈ సినిమాలను నిర్మించనున్నారు. ఈ విషయాన్నీ తాజాగా కార్తికేయ, రాజమౌళి వారి వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. కాగా, “ఆక్సిజన్” సినిమాతో సిద్ధార్ద్ నాదెళ్ల, “డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” సినిమాతో శశాంక్ ఏలేటి డైరెక్టర్స్ గా పరిచయం అవుతున్నారు. కాగా, ఈ రెండు సినిమాలను దర్శక ధీరుడు రాజమౌళి ప్రెసెంట్ చేస్తున్నారు. పైగా ఈ రెండు తెలుగు సినిమాలాలో ఫహద్ ఫాజిల్ హీరోగా నటించడం విశేషం.

ఫహద్ ఫాజిల్ విషయానికొస్తే .. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించారు ఫహద్. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులందిరికి సుపరిచితుడైపోయాడు. ఈ హీరో మలయాళీ సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి ఆదరణే లభించింది. ఇక ప్రస్తుతం పుష్ప పార్ట్-2 లో ఆయన నటిస్తున్నాడు. వాటితో పాటు తెలుగులోను.. “ఆక్సిజన్”, ” డోంట్ ట్రబుల్ ది ట్రబుల్” సినిమాలలో.. హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలతోనే కార్తికేయ నిర్మాణ రంగంలో అడుగుపెట్టబోతున్నాడు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి