iDreamPost

స్టేజీ మీదే అనసూయకు సారీ చెప్పిన ఛోటా కే నాయుడు.. ఏం జరిగిందంటే

  • Published Sep 24, 2023 | 10:59 AMUpdated Sep 24, 2023 | 10:59 AM
  • Published Sep 24, 2023 | 10:59 AMUpdated Sep 24, 2023 | 10:59 AM
స్టేజీ మీదే అనసూయకు సారీ చెప్పిన ఛోటా కే నాయుడు.. ఏం జరిగిందంటే

యాకంర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది నటి అనసూయ. రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు సినిమా అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో బుల్లితెర మీద యాంకరింగ్‌కి పూర్తిగా గుడ్‌ బై చెప్పి.. తన ఫుల్‌ ఫోకస్‌ సినిమాల మీదనే పెట్టింది. ప్రస్తుతం అనసూయ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు అనసూయ. తన మీద వచ్చే విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్‌లు ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె నాయుడు అనసూయకు.. స్టేజీ మీద సారీ చెప్పారు. ఎందుకు అంటే..

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘పెదకాపు-1’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లోని శిల్పకలా వేదికలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో అనసూయ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను అక్కమ్మ అనే పాత్రలో నటించాను. ఇది నేను చేసిన గొప్ప పాత్రల్లో ఒకటి. ఈ సినిమాలో నటించడం నా అదృష్టం. దీనంతటికీ కారణమైన శ్రీకాంత్ అడ్డాల గారికి థాంక్యూ సో మచ్. నాకు అక్కమ్మ పాత్రను ఇచ్చినందుకు. మొత్తానికి నేను పేరు చెప్పగలుగుతున్నాను’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

అయితే ఛోటా కె నాయుడు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు అనసూయ ప్రస్తావన తీసుకురాలేదు. దాంతో అనసూయ తాను మాట్లాడే సమయంలో ఈ ప్రస్తావన తెచ్చింది. దాంతో ఆయన మర్చిపోయాను అంటూ స్టేజీ మీదనే అనసూయకు సారీ చెప్పారు. వెంటనే అనసూయ.. ‘అయ్యో సార్.. మీరు సారీ చెప్పడమేంటి’ అంటూ నవ్వుతూ అనసూయ బదులిచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి