iDreamPost

మరోసారి కెమెరాకి జంటగా.. ‘అదితీ జీ వన్ కపుల్ ఫొటో ప్లీజ్’

  • Published Jan 28, 2024 | 6:53 PMUpdated Jan 28, 2024 | 6:53 PM

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ హీరోయిన్ ఆదితి రావు హైదరీ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రూమర్స్ అన్ని నిజామే అంటూ ఆదితి, సిద్దార్థ్ ముంబాయిలో అలా దర్శనమిచ్చారు.

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ హీరోయిన్ ఆదితి రావు హైదరీ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రూమర్స్ అన్ని నిజామే అంటూ ఆదితి, సిద్దార్థ్ ముంబాయిలో అలా దర్శనమిచ్చారు.

  • Published Jan 28, 2024 | 6:53 PMUpdated Jan 28, 2024 | 6:53 PM
మరోసారి కెమెరాకి జంటగా.. ‘అదితీ జీ వన్ కపుల్ ఫొటో ప్లీజ్’

సినీ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ తరుచుగా ఎదో ఒక వార్తలతో హాట్ టాపిక్ నిలుస్తాడు. ఈ క్రమంలోనే.. గత కొంతకాలం నుంచి హీరోయిన్ ఆదితి రావు హైదరీతో రిలేషన్షిఫ్ లో ఉన్నడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే మొదటలో వీరద్దరూ కలిసి ఒక సినిమాలో నటించడంతో ఇలా పుకార్లు మొదలయ్యాయని అంతా అనుకున్నారు. కానీ, ఆ తర్వాత సిద్దార్థ్, ఆదితి కలసి చాలా ప్రైయిట్ కార్యక్రమాల్లో కనిపించడంతో వీరిపై వచ్చే పుకార్లు నిజమని కంఫర్మ్ అయ్యాయి. దీనికి తోడు ఇద్దరూ సోషల్ మీడియాలో కలిసి రీల్స్ చేయడంతో వీళ్లు డేటింగ్ లోనే ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై ఇంతకు ముందు ఆదితిని ప్రశ్నించగా చాలా తెలివిగా సమాధానం చెప్పి, అసలు విషయాన్ని దాటవేసింది. కాగా, ఇటీవలే వీరిద్దరు న్యూ ఇయర్ సందర్భంగా జంటగా కనిపించిన సంగతీ తెలిసిందే. కానీ, వీరి రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలకు ఎవ్వరు నోరు విప్పడం లేదు. అయితే తాజాగా ఈ రూమర్స్ కి బలం చేకురేలా మరోసారి లవ్ బర్డ్స్ ముంబాయిలోని కెమెరాల కంటికి చిక్కింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ముంబయికి చెందిన నటి నటాషా పూనావాలా తాజాగా తన నివాసంలో నిర్వహించిన కచేరి పార్టీకి ఈ జంట హాజరయ్యారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కి వెళ్తున్న ఆదితి, సిద్దార్థ్ లు కెమెరాల కంటికి చిక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో అనేది నెట్టింట వైరలవుతోంది. కాగా, వీరిని చూసిన ఫోటోగ్రాఫర్ ‘ఆదితి జీ ఏక్ కపుల్ ఫోటో ప్లీజ్’ అంటూ సరదాగా ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. వీరితో పాటు.. అక్కడ నటుడు ఇషాన్ ఖట్టర్ కూడా కనిపించారు.

అయితే వీరిద్దరిపై వస్తున్న డేటింగ్ రూమర్స్ పట్ల ఇంతవరకు ఎవరూ స్పందించకపోయిన, వీరి సాన్నిహిత్యం చూస్తే ఎవరైనా లవ్ అనుకోవాల్సిందే. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ జంట మరోసారి కలిసి బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని ఇటీవలే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో సిద్ధార్థ్, ఆదితి రావు హైదరీ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘హరిలో రంగ హరి’ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. క్రాస్ పిక్చర్స్ పతాకంపై సునీత తాటి, వ్యూవు థామస్ కిమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఓ కొరియన్ సినిమాకి రీమేక్ అని తెలిసింది. మరి, సిద్దార్థ్, ఆదితి రిలేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి