iDreamPost

సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్ష తేదీ ఎప్పుడంటే?

సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వాటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఏ దరఖాస్తు గడువుతో పాటు పరీక్ష తేదీ షెడ్యూల్ ను మార్చింది. ఆ వివరాలు మీకోసం..

సైనిక్ స్కూల్స్ లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. వాటి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఏ దరఖాస్తు గడువుతో పాటు పరీక్ష తేదీ షెడ్యూల్ ను మార్చింది. ఆ వివరాలు మీకోసం..

సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్ష తేదీ ఎప్పుడంటే?

సోల్జర్స్ కి సమాజంలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రక్షణ రంగంలో మీ పిల్లల్ని సైనికులుగా చూసే అవకాశం వచ్చింది. దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలుగనే విద్యార్థులకు ఇదొక గోల్డెన్ ఛాన్స్. దేశంలో ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. ముందుగా డిసెంబర్ 16తో ముగియనుండగా ఆ తేదీని డిసెంబర్ 20 వరకు ఎన్టీఏ పొడిగించింది. అదే విధంగా పరీక్ష తేదీలో కూడా మార్పులు చేసింది. ముందుగా ప్రవేశ పరీక్షను జనవరి 21 వ తేదీగా నిర్ణయించారు. తాజాగా పరీక్ష తేదీని మార్చి జనవరి 28న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తెలిపింది.

దేశంలోని సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులకు చివరి తేదీ దగ్గరపడుతోంది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్​కు అవసరమైన అధికారులను స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే రెడీ చేసే లక్ష్యంతో.. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ (2024-25)లో ఆరో క్లాస్, తొమ్మిదో క్లాస్​లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఎగ్జామ్​ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దేశంలోని 33 సైనిక స్కూళ్లలో 6, 9 క్లాసులకు.. కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక స్కూళ్లల్లో నెక్స్ట్ ఇయర్ నుంచే ఈ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.

సైనిక్ స్కూల్స్ నోటిఫికేషన్​ ముఖ్యాంశాలు:

  • ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిసెంబర్ 20వ తేదీ వరకు https://aissee.ntaonline.in/ అప్లయ్ చేసుకోవచ్చు.
  • సైనిక్ స్కూల్స్ అన్నీ కూడా సీబీఎస్​ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీతో పాటు ఇతర ట్రైనింగ్ అకాడమీస్​కు ఇక్కడ క్యాడెట్లను రెడీ చేస్తారు.
  • ఎంట్రన్స్ ఎగ్జామ్ జనవరి 28 (ఆదివారం)న నిర్వహిస్తారు. పెన్ను, పేపర్ (ఓఎంఆర్ షీట్) పద్ధతిలోనే పరీక్ష ఉంటుంది. ఇందులో అన్నీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఈ ఎగ్జామ్​ను దేశవ్యాప్తంగా 186 టౌన్స్/సిటీస్​లో నిర్వహిస్తారు.
  • ఆరో క్లాసుకు అప్లయ్ చేసుకొనే విద్యార్థులు మార్చి 31, 2024 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.
  • తొమ్మిదో క్లాసుకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థుల వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో క్లాసులో పాసై ఉండాలి.
  • ఈ పరీక్షకు అప్లయ్ చేసుకొనే వారికి ఫీజ్ ఉంది. జనరల్, రక్షణ రంగంలో పనిచేస్తున్న వాళ్ల పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్​ సర్వీస్​మెన్ పిల్లలకు రూ.650, ఎస్సీ/ఎస్టీలకు రూ.500 చొప్పున ఫీజును నిర్ణయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి