iDreamPost

నో కార్డ్, నో ఫోన్.. కారు నుంచే ఫ్యూయల్ చెల్లింపులు! ఎలాగంటే..?

  • Author singhj Published - 04:21 PM, Mon - 11 September 23
  • Author singhj Published - 04:21 PM, Mon - 11 September 23
నో కార్డ్, నో ఫోన్.. కారు నుంచే ఫ్యూయల్ చెల్లింపులు! ఎలాగంటే..?

కరోనా తర్వాత డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగిపోయాయి. కిరాణా కొట్టు, హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్.. ఇలా అన్ని చోట్లా పేమెంట్స్ కోసం యూపీఐ యాప్స్​ను వినియోగిస్తున్నారు. జేబులో పర్సు లేకపోయినా.. చేతిలో ఫోన్ ఉంటే చాలు చెల్లింపులు చేసేయొచ్చు. మొబైల్స్​తోనే ఫాస్టాగ్ రీఛార్జ్ లాంటివి కూడా చేసేయొచ్చు. ఆధునిక టెక్నాలజీ వాడకం వల్లే డిజిటల్ పేమెంట్స్ విషయంలో మన దేశం దూసుకెళ్తోంది. స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్లందరూ తమకేం కావాలన్నా యూపీఐల ద్వారా కొనేస్తున్నారు.

కారు లేదా బైక్​లో ఫ్యూయల్ పోయించాలన్నా చాలా మంది యూపీఐల ద్వారా లేదా కార్డుల ద్వారా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని కొత్త మార్పులు రానున్నాయి. దిగ్గజ అంతర్జాతీయ సంస్థ అమెజాన్, మాస్టర్ కార్డు మద్దతు ఉన్న టోన్​ట్యాగ్ అనే కంపెనీ ‘పే బై కార్’ అనే కొత్త డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను ఆవిష్కరించింది. ఇది యూపీఐ సపోర్ట్​తో పనిచేస్తుంది. అంటే మీ చేతిలో స్మార్ట్​ఫోన్ గానీ, కార్డు గానీ లేకపోయినా కేవలం కారులోని ఇన్ఫోటైన్​మెంట్ నుంచే ఇకపై చెల్లింపులు చేసేయొచ్చు. రీసెంట్​గా ఎంజీ హెక్టార్, భారత్ పెట్రోలియంతో కలసి ‘పే బై కార్’ చెల్లింపుల వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

పెట్రోల్ బంక్​కు వెళ్లినప్పుడు కారులోని ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్ ఫ్యూయల్ డిస్​పెన్సర్ నంబర్​ను డిస్​ప్లే చేస్తుంది. బంక్​కు రాగానే వాహనదారుడికి అనౌన్స్​మెంట్ వినిపిస్తుంది. అదే సమయంలో పెట్రోల్ బంక్ సిబ్బందినీ అలర్ట్ చేస్తుంది. అనంతరం ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ ద్వారా ఎంత ఫ్యుయల్​ కావాలో ఎంటర్ చేస్తే సరిపోతుంది. ‘పే బై కార్’ సదుపాయంతో ఫాస్టాగ్​ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. చెల్లింపుల తర్వాత అకౌంట్​లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇన్ఫోటైన్​మెంట్ స్క్రీన్​ మీద కనిపిస్తుంది. రీసెంట్​గా గ్లోబల్ ఫిన్​టెక్ ఫెస్ట్​లో ఎన్​పీసీఐతో కలసి యూపీఐలో కన్వర్జేషనల్ పేమెంట్​ల సిస్టమ్​ను టోన్ ట్యాగ్ ఆవిష్కరించింది.

ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్ట్​పై ముందు జోస్యం చెప్పిన వేణు స్వామి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి