iDreamPost

నిజామాబాద్ జిల్లాలో సీక్రెట్ గా పాడు పనులు! ఏకంగా 10 మంది మహిళలతో!

నిజామాబాద్ పట్టణంలో కొందరు వ్యక్తులు 10 మంది మహిళలతో గలీజ్ దందాను నడిపిస్తున్నారు. చాలా కాలంగా సీక్రెట్ గా కొనసాగుతున్న ఈ దందా ఎట్టకేలకు ఇటీవల వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ పట్టణంలో కొందరు వ్యక్తులు 10 మంది మహిళలతో గలీజ్ దందాను నడిపిస్తున్నారు. చాలా కాలంగా సీక్రెట్ గా కొనసాగుతున్న ఈ దందా ఎట్టకేలకు ఇటీవల వెలుగులోకి వచ్చింది.

నిజామాబాద్ జిల్లాలో సీక్రెట్ గా పాడు పనులు! ఏకంగా 10 మంది మహిళలతో!

ఈ మధ్య కొందరు వ్యక్తులు కష్టపడి పని చేయకుండా ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. దీని కోసం ఎంతటి దారుణాలకైన తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కొందరు వ్యక్తులు నిజామాబాద్ పట్టణంలో ఇలాంటి పనులకే తెర లేపారు. ఏకంగా 10 మంది మహిళలతో గలీజ్ దందాను నడిపిస్తున్నారు. చాలా కాలంగా సీక్రెట్ గా కొనసాగుతున్న ఈ దందా ఎట్టకేలకు ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిర్వహకులను అరెస్ట్ చేసి దాదాపు 10 మంది మహిళలను రక్షించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ పట్టణంలో కొందరు నిర్వాహకులు వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. నిరుపేద మహిళలు, అమ్మాయిలను ఆసరా చేసుకుని ఈ గలీజ్ దందాను నడిపిస్తున్నారు. అయితే ఈ నిర్వాహకులు చాలా కాలంగా గట్టు చప్పుడు కాకుండా పట్టణంలోని మూడు చోట్ల వ్యభిచారాలను నడిపిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పసిగట్టిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటన అక్కడి చేరుకున్న పోలీసులు.. మూడు వ్యభిచార గృహాలపై ఏక కాలంలో దాడులు నిర్వహించారు.

వీరి దాడుల్లో ఐదుగురు విటులను అదుపులోకి తీసుకుని ఏకంగా 10 మంది మహిళలను రక్షించారు. దీంతో పాటు పోలీసులు వారి నుంచి రూ. 76,050లను స్వాధీనం చేసుకున్నారు. ఇక రక్షించిన ఆ 10 మంది మహిళలను రక్షిత గృహాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. నిజామాబాద్ పట్టణంలో సీక్రెట్ గా కొనసాగించిన ఈ పాడు పనుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి