iDreamPost

అపూర్వ కలయిక.. ఒకేచోట కలుసుకున్న మోదీ, యోగీ సిస్టర్స్‌!

అపూర్వ కలయిక.. ఒకేచోట కలుసుకున్న మోదీ, యోగీ సిస్టర్స్‌!

ఈ సమాజంలో బిల్డప్‌ రాయుళ్లకు కొదవలేదు. తమ దూరపు చుట్టాల్లో కౌన్సిలర్‌ ఉన్నా సరే.. మా వాడు అని గొప్పగా చెప్పుకుంటారు. కౌన్సిలర్‌ పేరు చెప్పి చేయాల్సిన దందాలు చేసేస్తుంటారు. తమ కుటుంబీకుడు ఉన్నత స్థితిలో ఉన్నా.. అత్యంత సాధారణ జీవితం గడిపే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్య నాథ్‌ కుటుంబసభ్యులు ముందు వరుసలో ఉంటారు. వారందరూ ఇప్పటికీ అత్యంత సాధారణమైన జీవితాన్ని సాగిస్తున్నారు.

తాజాగా, ఇద్దరు టాప్‌ లీడర్ల కుటుంబీకుల జీవితానికి అద్దం పట్టే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్య నాథ్‌ సోదరీమణులు ఇద్దరూ ఒకే చోట కలిశారు. ఆ వివరాల్లోకి వెళితే.. నరేంద్ర మోదీ చెల్లెలు వాసంతిబెన్‌, తమ కుటుంబసభ్యులతో కలిసి కొద్దిరోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని నీల్‌కంఠ్‌థామ్‌ యాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా భువనేశ్వరీ మాత గుడికి కూడా వెళ్లారు. అక్కడ గుడి దగ్గర యోగీ ఆధిత్యనాథ్‌ చెల్లెలు శశి ‘‘ మా భువనేశ్వరీ ప్రసాద్‌ భండార్‌’’పేరిట ఓ షాపు నిర్వహిస్తున్నారు.

ఆమె భర్త పక్కనే ఓ టీ షాపు నిర్వహిస్తున్నాడు. భువనేశ్వరి గుడికి వెళ్లిన వాసంతిబెన్‌ శశిని ఆమె షాపు దగ్గర కలిశారు. ఆప్యాయంగా ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. వాసంతిబెన్‌, శశి ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్న దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరూ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అంత సింపుల్‌గా ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మరి,  నరేంద్ర మోదీ చెల్లెలు వాసంతిబెన్‌.. యోగీ ఆధిత్య నాథ్‌ చెల్లెలు శశి ఒకే చోట కలవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి