iDreamPost

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ షాకింగ్ పోస్ట్.. బుమ్రాను వదులుకోనుందా?

  • Author Soma Sekhar Updated - 05:46 PM, Thu - 7 December 23

హార్దిక్ పాండ్యా రావడంతో.. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై యాజమాన్యం ఓ షాకింగ్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ బుమ్రాను MI టీమ్ వదులుకోనుందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

హార్దిక్ పాండ్యా రావడంతో.. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై యాజమాన్యం ఓ షాకింగ్ పోస్ట్ ను షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ బుమ్రాను MI టీమ్ వదులుకోనుందా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

  • Author Soma Sekhar Updated - 05:46 PM, Thu - 7 December 23
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ షాకింగ్ పోస్ట్.. బుమ్రాను వదులుకోనుందా?

IPL 2024.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. క్రికెట్ లవర్స్ ను అయోమయంతో పాటుగా ఆందోళనకు గురిచేస్తోంది. క్యాష్ ఆన్ డీల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ను వీడి తిరిగి తన సొంత టీమ్ ముంబై ఇండియన్స్ కు చేరాడు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ డీల్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్దదిగా హిస్టరీ క్రియేట్ చేసింది. దాంతో పాటుగా ఎన్నో సమస్యలకు దారి తీసిందనే చెప్పాలి. పాండ్యా ముంబైకి రావడంతో.. ఎప్పటి నుంచో రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ గా తననే ఎంపిక చేస్తారని భావించిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు గట్టి షాక్ తగిలినట్లైంది. ఇక ఈ విషయంపై తీవ్ర అసంతృప్తికి లోనైన బుమ్రా సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ లు పెట్టిన సంగతి మనందరికి తెలిసిందే. తాజాగా ముంబై ఇండియన్స్ టీమ్ షాకింగ్ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు బుమ్రాను ముంబై ఫ్రాంచైజీ వదులుకోబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం.

జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కాకముందే.. వార్తల్లో మారుమ్రోగుతున్న ఆటగాళ్లు. దానికి కారణం మనందరికీ తెలిసిందే! రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ ను వదిలి ముంబై ఇండియన్స్ కు వచ్చాడు హార్దిక్ పాండ్యా. క్యాష్ ఆన్ డీల్ లో భాగంగా ఇది జరిగింది. ఇక్కడి నుంచే అసలు కథ మెుదలైంది. పాండ్యా ముంబైకి రావడంతో.. బుమ్రా అలిగి.. పలు షాకింగ్ పోస్ట్ లు చేశాడని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి విదితమే. రోహిత్ శర్మ తర్వాత ముంబై జట్టు పగ్గాలు చేపట్టాలని భావించిన బుమ్రాకు పాండ్యా గట్టి షాకిచ్చాడు.

కాగా.. హార్దిక్ కు కెప్టెన్సీలో బుమ్రా కంటే ఎక్కువ అనుభవం ఉండటంతో.. అతడికే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ విషయంలోనే బుమ్రా అలిగి.. ” కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటమే బెస్ట్ ఆన్సర్ అవుతుంది” అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ కొన్ని రోజుల క్రితం సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి ఈ పోస్ట్ వార్తల్లో నిలిచింది. ఈసారి ముంబై ఇండియన్స్ షాకింగ్ పోస్ట్ చేసి.. ఫ్యాన్స్ ను అయోమయానికి గురిచేసింది. ముంబై ఫ్రాంచైజీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో బుమ్రా పిక్ ను పోస్ట్ చేసి.. దానికి ” కొన్ని సమయాల్లో మౌనంగా ఉండటమే బెస్ట్ ఆన్సర్ అవుతుంది” అంటూ గతంలో బుమ్రా పెట్టిన క్యాప్షన్నే పెట్టింది.

అయితే ఈ వార్తలపై ముంబై ఫ్రాంచైజీ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ పోస్ట్ పెట్టడంతో.. ఏ ఉద్దేశంతో పెట్టారు అన్నది అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు క్రికెట్ లవర్స్. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. బుమ్రాను ముంబై వదులుకుంటుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ముంబై ఈ పోస్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? నిజంగానే బుమ్రాను ముంబై వదిలేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి