iDreamPost

ఉన్న వనరులతోనే అభివృద్ధి : మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ఉన్న వనరులతోనే అభివృద్ధి : మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

అందుబాటులో ఉన్న వనరులతో విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధాని తరలింపు పేరుతో తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. విశాఖ నగరాన్ని తానే అభివృద్ధి చేశానంటూ తెదేపా అధినేత చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

‘‘అసెంబ్లీ, సచివాలయం మాత్రమే ఉంటే రాజధాని అభివృద్ధి చెందదని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐటీ అభివృద్ధితో పాటు కనెక్టివిటీ, యాక్టివిటీ పెరగాలని అప్పుడు ఆయన అన్నారు. అవన్నీ ఇప్పుడు విశాఖలో ఉన్నాయి కదా? రాజధాని రైతులను ఇంకా మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అతని మాయలో పడొద్దని రైతులను కోరుతున్నా. విశాఖలో ఎస్‌ఈజెడ్‌, ఐటీ, ఫార్మాసిటీ.. ఇవన్నీ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగాయి’’ అని బొత్స వివరించారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి