iDreamPost

ఒకే వేదికపై ఇద్దరు తల్లుల్ని పెళ్లాడిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే..

ఆ ఇద్దరూ తల్లులు అవడానికి కారణం అతనే. ఒకరితో నిశ్చితార్థమయ్యాక.. మరో యువతిని ప్రేమించి.. ఇద్దరితోనూ ఇద్దరు పిల్లల్ని కన్నాక, ఆ ఇద్దరు యువతుల్నీ ఒకేవేదికపై పెళ్లాడిన ఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆ ఇద్దరూ తల్లులు అవడానికి కారణం అతనే. ఒకరితో నిశ్చితార్థమయ్యాక.. మరో యువతిని ప్రేమించి.. ఇద్దరితోనూ ఇద్దరు పిల్లల్ని కన్నాక, ఆ ఇద్దరు యువతుల్నీ ఒకేవేదికపై పెళ్లాడిన ఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఒకే వేదికపై ఇద్దరు తల్లుల్ని పెళ్లాడిన వ్యక్తి.. ట్విస్ట్ ఏంటంటే..

ఒకే వేదికపై ఇద్దరు తల్లుల్ని పెళ్లాడో వ్యక్తి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఇద్దరూ తల్లులు అవడానికి కారణం అతనే. ఒకరితో నిశ్చితార్థమయ్యాక.. మరో యువతిని ప్రేమించి.. ఇద్దరితోనూ ఇద్దరు పిల్లల్ని కన్నాక, ఆ ఇద్దరు యువతుల్నీ ఒకేవేదికపై పెళ్లాడిన ఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో చోటుచేసుకుంది. కేశ్ కాల్ ప్రాంతంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్ సింగ్ సలామ్ కు అండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్ తో నిశ్చితార్థమయింది. నిశ్చితార్థం అనంతరం దుర్గేశ్వరీ రంజన్ ఇంటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చి, ఆడపిల్లకు జన్మనిచ్చింది.

కొద్దిరోజుల తర్వాత రంజన్ అంవరీ గ్రామానికి చెందిన సన్నోబాయి గోటా అనే మరో యువతిని ప్రేమించి, ఆమెనూ గర్భవతిని చేశాడు. సన్నో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు రంజన్ సింగ్ కుటుంబంలో మాట్లాడి, పంచాయతీ నిర్వహించారు. పంచాయతీలో ఇద్దరు యువతులూ రంజన్ ను పెళ్లాడేందుకు అంగీకరించడంతో జూన్ 8వ తేదీన ఒకే వేదికపై రంజన్ ఆ ఇద్దరినీ పెళ్లాడాడు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి