iDreamPost

ఎన్నికలు వాయిదా పై హైకోర్టులో లంచ్ మోషన్.. కాసేపట్లో విచారణ..

ఎన్నికలు వాయిదా పై హైకోర్టులో లంచ్ మోషన్.. కాసేపట్లో విచారణ..

దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ వల్ల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే రద్దు చెయ్యాలని కోరుతూ నెల్లూరు కు చెందిన పి. సత్యనారాయణ అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ ని దాఖలు చేశారు.

సదరు లంచ్ మోషన్ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, దీనిపై ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నర తరువాత విచారణ చేపడతామని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ వాయిదా వ్యవహారం రాజకీయంగా పెను దుమారం లేపడంతో, ఈ అంశంపై హైకోర్టు ఎటువంటి ఆదేశాలిస్తుంది అనే దానిపై సర్వాత్రా తీవ్ర ఆసక్తి నెలకొనివుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి