iDreamPost

తండ్రికి కిడ్నీ దానం చేస్తున్న మాజీ సీఎం కూతురు..

తండ్రికి కిడ్నీ దానం చేస్తున్న మాజీ సీఎం కూతురు..

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ మార్పిడి జరగనుంది. ఆయన రెండో కుమార్తె రోహిణీ ఆచార్య కిడ్నీని లాలూకు అమర్చనున్నారు. రోహిణీ సింగపూర్‌లో నివసిస్తున్నారు. లాలూ అక్టోబర్‌లో సింగపూర్‌ వెళ్లి వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకున్నారు.

Daughter Rohini Acharya to donate her kidney to father, Lalu P...

వారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకోవాలని ఆయనకు సూచించారు. దీంతో తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు రోహిణి ముందుకొచ్చారు. తన ప్రాణం కాపాడుకొనేందుకు కుమార్తె కిడ్నీని స్వీకరించేందుకు లాలూ నిరాకరించినట్లు సమాచారం.

Lalu Yadav's daughter Roshni to donate kidney to her father | Mint

కానీ, కుమార్తె ఒత్తిడి చేయడంతో పాటు, కుటుంబ సభ్యుల కిడ్నీని అమరిస్తే శస్త్రచికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆయన అంగీకరించాల్సి వచ్చింది. ఆపరేషన్‌ కోసం లాలూ నవంబర్‌ 20-24 మధ్య సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి