iDreamPost

చరిత్రకు అడుగు దూరంలో జైస్వాల్.. ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​​గా..!

  • Published Feb 29, 2024 | 4:42 PMUpdated Feb 29, 2024 | 4:42 PM

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో పరుగుల వరద పారిస్తున్నాడు యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు చరిత్ర సృష్టించేందుకు మరో అడుగు దూరంలో ఉన్నాడు.

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో పరుగుల వరద పారిస్తున్నాడు యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు చరిత్ర సృష్టించేందుకు మరో అడుగు దూరంలో ఉన్నాడు.

  • Published Feb 29, 2024 | 4:42 PMUpdated Feb 29, 2024 | 4:42 PM
చరిత్రకు అడుగు దూరంలో జైస్వాల్.. ఆ ఘనత సాధించిన తొలి బ్యాటర్​​గా..!

ఏ ప్లేయర్​కైనా ఇంటర్నేషనల్ క్రికెట్​కు అలవాటు పడాలన్నా, తాము ఆడే జట్లలో చోటును పదిలపర్చుకోవాలన్నా కొంత టైమ్ అవసరం. కానీ కొందరు ఆటగాళ్లు అవకాశం వచ్చిందే తడవుగా రెచ్చిపోయి ఆడుతుంటారు. తక్కువ సమయంలోనే అన్ని ఫార్మాట్లలోనూ టీమ్​లో రెగ్యులర్ ప్లేయర్​గా మారిపోతారు. ఈ కోవలోకే వస్తాడు భారత యంగ్​ బ్యాటర్ యశస్వి జైస్వాల్. ఆడింది తక్కువ మ్యాచులే అయినా నిలకడైన ఆటతీరు, సెంచరీల మీద సెంచరీలు, డబుల్ సెంచరీలు కొడుతూ టీమ్ మేనేజ్​మెంట్​ తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడతను. ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​లోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. అతడ్ని ఆపడం ప్రత్యర్థి బౌలర్ల వల్ల కావడం లేదు. నిజమైన బజ్​బాల్ అంటే ఏంటో ఇంగ్లీష్ టీమ్​కు అతడు రుచి చూపిస్తున్నాడు. సూపర్ ఫామ్​లో ఉన్న జైస్వాల్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు.

ఇంగ్లండ్​తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్​లో జైస్వాల్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటిదాకా ఈ సిరీస్​లో 4 మ్యాచులు ఆడిన ఈ కుర్ర బ్యాటర్.. 93.57 యావరేజ్​తో ఏకంగా 655 పరుగులు చేశాడు. ఈ సిరీస్​లో అతడే టాప్ స్కోరర్​గా కొనసాగుతున్నాడు. నాలుగు టెస్టుల్లో ఇంగ్లీష్ టీమ్​పై ఏకంగా 2 డబుల్ సెంచరీలు బాదాడు జైస్వాల్. రెడ్ హాట్ ఫామ్​లో ఉన్న ఈ ముంబైకర్.. క్రికెట్​లో అరుదైన ఘనతను అందుకునేందుకు ఉరకలెత్తుతున్నాడు. మార్చి 7వ తేదీన ధర్మశాల వేదికగా మొదలుకానున్న ఐదో టెస్టుకు ముందు జైస్వాల్​ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆఖరి టెస్టులో మరో పరుగు చేస్తే.. ఇంగ్లండ్​ సిరీస్​లో అత్యధిక రన్స్ చేసిన కింగ్ విరాట్ కోహ్లీ (655) రికార్డును జైస్వాల్ బ్రేక్ చేస్తాడు. రాంచీ టెస్టులో కోహ్లీతో సమానంగా నిలిచిన యంగ్ బ్యాటర్.. ఇంకో పరుగు చేస్తే అతడ్ని దాటేస్తాడు.

ధర్మశాల టెస్టులో మరో రికార్డు కూడా యశస్వి జైస్వాల్​ను ఊరిస్తోంది. అతడు మరో 38 పరుగులు చేస్తే 21వ శతాబ్దంలో ఒక టెస్ట్ సిరీస్​లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్​గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ క్రమంలో సీనియర్ బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీ (692) రికార్డును జైస్వాల్ అధిగమిస్తాడు. ఐదో టెస్ట్​లో అతడు రెండు సార్లు బ్యాటింగ్​కు దిగే అవకాశం ఉంది. కాబట్టి 38 పరుగులు చేయడం ఈజీనే. ప్రస్తుతం అతడు ఉన్న ఫామ్​లో ఇంకో డబుల్ సెంచరీ బాదినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అలాంటప్పుడు ముప్పై ఎనిమిది పరుగులు చేయడం పెద్ద లెక్కే కాదు. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి టెస్ట్ సిరీస్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా జైస్వాల్ చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి. మరి.. చరిత్రకు అడుగు దూరంలో ఉన్న జైస్వాల్.. కింగ్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: WPLలో ఊహించని ఘటన.. లేడీ క్రికెటర్లపైకి దూసుకొచ్చిన ఫ్యాన్! ఆ తర్వాత..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి